ఒక రాష్ట్ర ప్రజలకు, కోట్ల మంది జనానికి ప్రజాప్రతినిధులుగా వ్యవహరించాల్సిన వ్యక్తులు… భవిష్యత్తు తరాలకు తాము ఒక బ్రాండ్ అంబాసిడర్ గా నిలబడాల్సిన వ్యక్తులు… మాట్లాడుతున్న మాటలు, వారు చేస్తున్న వ్యాఖ్యలు సెన్సార్ సినిమాను తలపిస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు పూర్తిగా ఏ సర్టిఫికెట్ రాజకీయాలు గా మారుతున్నాయి. ఇంట్లో టీవీ పెట్టి కుటుంబసమేతంగా చూస్తూ ఉంటే ఏ ఛానల్ లో ఏ మంత్రి ఏం మాట్లాడతాడో.. ఏ ప్రజాప్రతినిధుల నుంచి ఏ బూతు మాటలు వినాల్సి వస్తుందో… అన్న భయంతో వార్తలను సైతం కుటుంబ సభ్యులంతా కలిసి చూసేందుకు భయపడే పరిస్థితుల్లో ఏపీలో నెలకొంటున్నాయి. ముఖ్యంగా మంత్రివర్గంలో కీలక స్థానాల్లో ఉన్న కొందరు మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు… ప్రజాస్వామ్యంలో అనదగిన మాటలు కావు. ఇవి ఏపీ రాజకీయాల్లో మరో స్థాయికి దిగజారుస్తూన్నాయి.
పోటపోటీగా….
జగన్ క్యాబినెట్ లో మంత్రులు ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు… పనిలో అయితే కాదు.. కేవలం ప్రత్యర్థుల్ని బూతులతో దూషించడం లో, అనకూడని రాయకూడదని మాటలు అనడం లో మంత్రులు ఒకరితో ఒకరు తీవ్రంగా పోటీ పడుతున్నారు. నిన్న మొన్నటి వరకు పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఒక్కరే ప్రెస్మీట్ పెడితే బూతుపురాణం ఇతరుల్ని… ఇష్టానుసారం మాట్లాడితే ఇబ్బంది పెడతారని పేరుండేది. తాజాగా ఇప్పుడు కృష్ణా జిల్లాకే చెందిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా ఆయన తోడయ్యారు. విజయనగరం జిల్లా రామతీర్థం శ్రీ రాముల వారి విగ్రహం దోషం విషయంలో ఆలయ చైర్మన్ గా ఉన్న అశోక్గజపతిరాజు ఆయన వెధవ అంటూ సంబోధించడం అది అని మాధ్యమాల్లో ప్రసారం కావడం… దీంతోపాటు తెదేపా అధినేత చంద్రబాబును లోకేష్ ను సైతం ఆయన ఇష్టానుసారం మాట్లాడడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తోంది. విలేకరుల సమావేశం పెడితే లైవ్ ఇవ్వాలా వద్దా అన్ని టీవీ ఛానల్ వారు భయపడే పరిస్థితిని వీరు కల్పిస్తున్నారు. అసభ్యకరమైన పదజాలంతో ఇతరులను దూషించటం.. రాజకీయ ప్రత్యర్థుల మీద విరుచుకు పడడం ఇప్పుడు ఏపీ మంత్రుల్లో కొత్త ట్రెండ్.
జగన్ మనసు గెలుస్తారా?
ఈ ఏడాది ఏపీ మంత్రులకు రెండున్నరేళ్లు పూర్తవుతుంది. నవంబర్ నాటికి జగన్ చెప్పిన దాని ప్రకారం మంత్రివర్గాన్ని పూర్తిగా కొత్తవాళ్లతో నింపే అవకాశం ఉంది. అయితే ఈ సమయంలో ప్రత్యర్థుల్ని తమ వ్యాఖ్యలతో మాటలతో ఇరుకున పెట్టేందుకు మంత్రులు ఎక్కువగా ఆలోచిస్తున్నట్లు అర్థమవుతోంది. దీని ద్వారా ఫైర్బ్రాండ్ గా ముద్ర వేయించుకుని జగన్ మంత్రివర్గంలో మరోదఫా కొనసాగేందుకు వీరు ఎత్తులు వేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా. అయితే దీని వైఎస్సార్సీపీ అధినేత జగన్ స్వాగతిస్తే మాత్రం భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీకి ఇబ్బందులు తప్పవు. ఇలాంటి మాటలు వ్యాఖ్యలను సాధారణ ప్రజానీకం ఎవరు స్వాగతించారు. ఇప్పటికే కొడాలి నాని విషయంలో వైఎస్ఆర్సిపి బ్యాడ్ ఇమేజ్ ముద్రపడింది. ఇప్పుడు ఆయనకు తోడుగా మరి కొందరు మంత్రులు సైతం ఇదే తీరున వెళ్తే మొత్తం ప్రభుత్వానికే మచ్చ తప్పదు. దీన్ని వెంటనే జగన్ గుర్తించి మంత్రులకు సరైన సూచనలు ఇవ్వడమే ముందున్న కర్తవ్యం.
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!