NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Munna Gang Case: ఒకే కేసులో 12 మందికి ఉరిశిక్ష..! ఇండియాలో అతి సంచలన తీర్పులు ఇవే..!!

Munna Gang Case: హైవే కిల్లర్ మున్నా తో సహా అతని గ్యాంగ్ లోని 12 పన్నెండు మందికి ఏకకాలంలో ప్రకాశం జిల్లా సెషన్స్ కోర్టు మరణశిక్ష విధించడం భారతదేశ చరిత్రలోనే అరుదైన తీర్పు అని న్యాయనిపుణులు చెబుతున్నారు.అయితే ఒకే కేసులో ఇంత మందికి ఉరి శిక్ష పడటం ఇదే ప్రథమం కాదని కూడా వారు వివరిస్తున్నారు.మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకేసులో ఇరవై ఆరు మందికి ఉరిశిక్ష పడిందని వారు పేర్కొంటున్నారు.1993 బాంబు పేలుళ్ల కేసుల్లో కూడా దశలవారీగా చాలా మందికి ఉరిశిక్ష పడింది అంటున్నారు.ఇక మున్నా కేసు విషయానికొస్తే మొత్తం ఏడు కేసుల్లో పన్నెండు మందికి ఉరిశిక్ష పడినట్లు వారు గుర్తుచేస్తున్నారు. వివరాల్లోకి వెళితే…

12 hanged in one case ..! These are the most sensational verdicts in India .. !!
12 hanged in one case ..! These are the most sensational verdicts in India .. !!

రాజీవ్ గాంధీ హత్య కేసు!

1991 మే ఇరవై ఒకటి వ తేదీన తమిళనాడులోని శ్రీపెరంబదూర్లో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ దారుణ హత్యకు గురయ్యారు.పూలమాల వేసే నెపంతో మానవబాంబులు ఆయన దగ్గరకు వెళ్లి దగ్గరకు వెళ్లి తమను తాము పేల్చుకుని ఆయనను కూడా హతమార్చాయి.చెన్నైలోని స్పెషల్ కోర్టు ఈ కేసును విచారించింది.ప్రత్యేక టెర్రరిస్టు చట్టాల కింద విచారణ సాగింది.ఆ చట్టాలలోని సెక్షన్ల కింద ఈ కేసులో 26 మంది కి మరణశిక్ష విధించారు.అయితే వారంతా సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకున్న నేపధ్యంలో కేవలం ఒక్కరిని మాత్రమే ఇప్పటివరకు ఉరితీశారు.కానీ ఒకే కేసులో అత్యధిక మందికి ఉరిశిక్ష పడినది మాత్రం ఇందులోనేనని న్యాయపరమైన రికార్డులు చెప్తున్నాయి.

ముంబై పేలుళ్ల కేసు!

1993మార్చి పన్నెండు వ తేదీన ముంబాయ్ లోని వివిధ ప్రాంతాల్లో జరిగిన సంభవించిన పేలుళ్లలో 257 మంది మరణించారు..1500 మంది గాయపడ్డారు.భారత దేశాన్ని కుదిపేసిన ఈ టెర్రరిస్టు కుట్ర కేసులో దశలవారీగా పన్నెండు మందికి మరణశిక్షను విధించడం జరిగింది.స్పెషల్ డిజిగ్నేటెడ్ టాడా కోర్టు ఈ కేసును విచారించి ఇరవై ఏళ్ల తర్వాత 2013 లో శిక్షలు వేసుకుంటూ వెళ్లింది.అయితే ఈ కేసులో కూడా అందరికీ ఇంకా ఉరిశిక్ష అమలు జరగలేదు. వివిధ దశల్లో వారి అప్పీళ్లు పెండింగ్లో ఉన్నాయి.

Munna Gang Case: మున్నా కేసు విషయానికొస్తే!

ప్రకాశం జిల్లాను ఆ మాటకొస్తే ఆంధ్రప్రదేశ్ ని కూడా హడలెత్తించిన హైవే కిల్లర్ మున్నా గ్యాంగ్ మొత్తం ఏడు కేసుల్లో పదిహేడు మందిని హతమార్చినట్టు ప్రాసిక్యూషన్ రుజువు చేసింది.దీంతో ఆ గ్యాంగ్ లో పన్నెండు మంది ఉండగా మున్నాతో సహా పన్నెండు మందికి ఉరిశిక్షను,మరో నలుగురికి యావజ్జీవ కారాగారశిక్ష ,ఇద్దరికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఒంగోలు సెషన్స్ కోర్టు సోమవారం తీర్పు నిచ్చింది.ఒకే కేసులో ఒకే రోజున అత్యధిక మందికి ఉరిశిక్ష పడిన కేసులలో రాజీవ్ గాంధీ హత్య కేసు తర్వాత మున్నా కేసే నిలుస్తోంది.అయితే ఇంతటితో వీరందరూ ఉరికంబం ఎక్కినట్లు భావించనక్కర్లేదు .అప్పీల్ చేసుకోవడానికి వారికి అనేక మార్గాలు ఉన్నాయంటున్నారు న్యాయ కోవిదులు.మరి ఏం జరుగుతుందో చూడాలి..

 

Related posts

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N