Haryana: దేశంలో మహిళలు, బాలికల రక్షణకు ప్రభుత్వాలు కఠిన చట్టాలు అమలు చేస్తున్నా కామాంధులు అత్యాచారాలు, లైంగికదాడులు కొనసాగిస్తూనే ఉన్నారు. దేశంలో నిత్యం ఎక్కడో ఒక చోట ఇటువంటి ఘటనలు జరుగుతున్నట్లు మీడియాలో రిపోర్టు అవుతూనే ఉన్నాయి. కామంతో కళ్లు మూసుకుపోయిన వాళ్లు వావివరసలు మరచి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. చాలా కేసుల్లో పరిచయం ఉన్న వ్యక్తులే ఇలాంటి దారుణాలకు పాల్పడటం ఆందోళన కల్గిస్తోంది.
హర్యానాలో ఇటీవల జరిగిన ఓ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పది సంవత్సరాల బాలికను ఏడుగురు బాలురు అత్యాచారం చేశారు. నిందితుల్లో ఒకరికి 18 ఏళ్లు ఉండగా మిగిలిన ఆరుగురు 8 నుండి 14 సంవత్సరాల వయసు వారు కావడం గమనార్హం. రాంపూరా పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ఓ గ్రామానికి చెందిన పదేళ్ల బాలిక స్థానిక పాఠశాలలో మూడవ తరగతి చదువుతోంది. గత నెల 24వ తేదీన ఆమె ఇంటి సమీపంలో గల పాఠశాలలో చుట్టుపక్కల పిల్లలతో కలిసి ఆడుకుంటోంది. ఆ సమయంలో అక్కడే ఆడుకుంటున్న మరి కొందరు బాలురు ఆ బాలికపై అత్యాచారం చేశారు. ఈ ఘటనను వారు తమ సెల్ ఫోన్ లో రికార్డు చేసి ఒకరికి ఒకరు వాట్సాప్ లో షేర్ చేసుకున్నారు. ఈ వీడియో బయటకు రావడంతో బాధిత బాలిక తండ్రి దృష్టికి వెళ్లింది. ఆ వీడియో చూసి నిర్ఘాంతపోయిన బాధిత బాలిక తండ్రి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Read More: Crime News: పెళ్లి రోజు భార్యకు ఊహించని గిఫ్ట్ ఇచ్చి కటకటాలపాలైన భర్త..! ఊరంతా షాక్..!!
పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాలికను అత్యాచారం చేసిన వారిలో ఇద్దరు ఆ బాలిక కుటుంబానికే చెందిన వారు కాగా మిగిలిన వారు చుట్టపక్కల ఇళ్ల విద్యార్థులు. వీరిలో ఒకరికి 18 సంవత్సరాలు ఉండగా మిగిలిన వారు అందరూ మైనర్ లే. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు బాధిత బాలికను పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.