Raghurama: లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాను వైసీపీ ఎంపిలు మరో సారి కలిశారు. వైసీపీని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిని తీవ్రంగా ఇరుకున పెడుతున్న నర్సాపురం ఎంపి రఘురామ కృష్ణం రాజుపై అనర్హత వేటు వేయాలని గతంలో పిటిషన్ ఇచ్చిసంగతి తెలిసిందే. దాదాపు 10 నెలల క్రితం స్పీకర్ కు రఘురామకృష్ణం రాజు లోక్ సభ సభ్యత్వం రద్దు చేయాలని కోరుతూ వైసీపీ ఎంపీలు ఫిర్యాదు అందజేయగా ఆ పిటిషన్ పై చర్యలు తీసుకోకపోవడంతో పలు మార్లు కలిసి మరీ విన్నవించారు. తనపై అనర్హత వేటు వేయడానికి అవకాశం లేదనీ, తాను పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడలేదంటూ రఘురామకృష్ణం రాజు స్పీకర్ కు లేఖ రాస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా నేడు వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, మార్గాని భరత్ లు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాతో భేటీ అయ్యారు. రఘురామ కృష్ణం రాజు అనర్హత పిటిషన్ ను మరిన్ని ఆధారాలతో అందజేశారు.
ఇప్పటి వరకూ సమర్పించిన అనర్హత పిటిషన్ కు సరైన ఆధారాలు లేని కారణంగా లోక్ సభ స్పీకర్ చర్యలు తీసుకోలేదని భావించిన వైసీపీ ఎంపిలు నేడు మరిన్ని అధారాలతో అనర్హత పిటిషన్ ను అందించారు. ఈ తాజా పిటిషన్ పై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఏ విధంగా స్పందిస్తారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ దఫా పిటిషన్ తోనైనా రఘురామపై వేటు పడుతుందా? పడదా ? అనేది వేచి చూడాలి.
Read More: Steel Plant: ఏపికి ఒకే రోజు ఒక గుడ్ న్యూస్, మరో బ్యాడ్ న్యూస్..! అవి ఏమిటంటే..?
ఇది ఇలా ఉండగా కొద్ది రోజుల క్రితం రఘురామను ఏపి సీఐడీ రాజద్రోహం కింద అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయనకు సుప్రీం కోర్టు ఆ కేసులో బెయిల్ మంజూరు చేయడంతో విడుదల అయ్యారు. మీడియా ముందు మాట్లాడవద్దన్న కోర్టు ఆంక్షల నేపథ్యంలో రఘురామ తన ఫందాను మార్చుకున్నారు. గతంలో రచ్చబండ కార్యక్రమం పేరుతో నిత్యం వైఎస్ జగన్ ను , వైసీపీ ప్రభుత్వ చర్యలను విమర్శిస్తూ మీడియా సమావేశాలను నిర్వహించిన రఘురామ బెయిల్ పై బయటకు వచ్చిన తరువాత జగన్ కు లేఖాస్త్రాలు సంధిస్తున్నారు.