NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CM YS Jagan: ఏపి సీఎం వైఎస్ జగన్ కీలక ఆదేశాలు..! రాష్ట్రంలో కరెంటు కోతలు లేనట్టేనా..?

CM YS Jagan: దేశ వ్యాప్తంగా బొగ్గు కొరత కారణంగా విద్యుత్ సమస్య ఎక్కువవుతోంది. ఏపితో సహా చాలా రాష్ట్రాల్లో విద్యుత్ సంక్షోభం నెలకొంది. రెండు మూడు నెలల్లో తీవ్రమైన కరెంటు కోతలు ఉండనున్నాయని వార్తలు వినబడుతున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో కరెంటు కోతలు మొదలవ్వగా ఏపీలోనూ త్వరలో కరెంటు కోతలు ప్రారంభం అవ్వనున్నాయని ప్రచారం జరుగుతోంది. విద్యుత్ వాడకంపై ఇటీవలే ఏపి ప్రభుత్వ ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ ఓ ప్రకటన విడుదల చేశారు. సాయంత్రం 6 గంటల నుండి రాత్రి పది గంటల వరకూ ఏసీలు వాడొద్దని సూచించారు. పీక్ లోడింగ్ సమయంలో అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేయాల్సి వస్తోందనీ, కాబట్టి కరెంటును జాగ్రత్తగా వాడుకోవాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. విద్యుత్ కొరత ఏర్పడటానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడం వల్ల ఈ సమస్య ఏర్పడిందని వారు పేర్కొంటున్నారు. మరో పక్క సోషల్ మీడియాలో “జగనన్న కొవ్వొత్తి – అగ్గిపెట్టె పథకం పెట్టేటట్టు” ఉన్నారంటూ ప్రభుత్వ వ్యతిరేక వర్గాలు సెటైర్ లు వేస్తున్నారు. ఈ తరుణంలో సీఎం వైఎస్ జగన్ కీలక ప్రకటన ఛేశారు.

CM YS Jagan review on power crisis
CM YS Jagan review on power crisis

Read More: MAA: మా’ ఎన్నికల అధికారికి ప్రకాశ్ రాజ్ కీలక లేఖ..! ముదురుతున్న వివాదం..!!

CM YS Jagan: రాష్ట్రంలో కరెంటు కోతలు ఉండొద్దు

రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ పరిస్థితులపై సమీక్ష జరిపిన సీఎం జగన్.. ప్రస్తుత బొగ్గు నిల్వలు, ధర్మల్ కేంద్రాల్లో ఉత్పత్తి అవుతున్న విద్యుత్ పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం వద్ద నిధుల కొరత లేదనీ, దేశంలో బొగ్గు ఎక్కడ లభ్యమయినా కొనుగోలు చేయాలని ఆదేశించారు. ధర్మల్ విద్యుత్ కేంద్రాలన్నీ పూర్తి సామర్థ్యంతో నడిచేలా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణలోని సింగరేణి సంస్థతో సమన్వయం చేసుకుని అవసరాలకు తగ్గట్టుగా బొగ్గును తెప్పించుకోవాలని సీఎం ఆదేశించారు. అదే విధంగా కేంద్రంలోని సంబంధిత మంత్రిత్వ శాఖలు, ఏజన్సీలతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని చెప్పారు. కృష్ణపట్నం, వీటీపీఎస్ ప్లాంట్లలోని కొత్త యూనిట్లలో ఉత్పత్తిని వెంటనే ప్రారంభించాలన్నారు.

Read More: AP Govt:  సినీ రంగానికి బిగ్ రిలీఫ్ ఇచ్చిన జగన్ సర్కార్..!!

కోల్ ఇండియాకు 300 కోట్లు బాకీ

మరో పక్క కరెంటు సమస్యను పురస్కరించుకుని వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణంరాజు ప్రభుత్వాన్ని విమర్శించారు. విద్యుత్ సమస్య వల్ల రాష్ట్రం అంధకారంలోకి వెళ్లే పరిస్థితులు తలెత్తాయన్నారు. విద్యుత్ సమస్యపై తాను కోల్ ఇండియా చైర్మన్ తో చర్చించానని పేర్కొన్నారు. కోల్ ఇండియాకు ఏపి రూ.300 కోట్లు బాకీ ఉందని ఆయన తనతో చెప్పారన్నారు. కాగా రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేకుండా చర్యలు తీసుకోవాలంటూ సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు ఇవ్వడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju