Indian Railway: భారతదేశంలో ప్రయాణం చేయాల్సిన విషయంలో ఎక్కువగా ప్రజలు రైల్వే ప్రయాణాన్ని ఇష్టపడతారు. దీనివల్లే ఎక్కువగా భారతీయ ఖజానాకు కూడా రైల్వే శాఖ ద్వారా ఆదాయం లభిస్తూ ఉంటుంది. ఇటువంటి తరుణంలో రైల్వే శాఖ. భారతీయ రైల్వే ప్రయాణికుల కోసం గత కొద్ది నెలల నుండి సరికొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యంగా మహమ్మారి కరోనా రాకతో రైల్వేలో చాలా మార్పులు చోటు చేసుకుంటూ ఉండటంతో ఇప్పుడు వాటిని ఒక్కొక్కటిగా తొలగిస్తున్నారు. ఇదే సమయంలో కొత్త మార్పులు తీసుకు వస్తున్నారు. దీనిలో భాగంగా ఇటీవల రాత్రిపూట రైల్వే ప్రయాణం సమయంలో కొంతమంది.. ప్రయాణికులు సెల్ ఫోన్ ద్వారా ఎక్కువ సౌండ్ పెట్టి పాటలు పెట్టడంతోపాటు రాత్రి పది గంటల తర్వాత కూడా ఎవరికి వారు లైట్లు వేస్తుండటంతో చాలామంది ప్రయాణికులు ఇబ్బందులు పడటం మాత్రమే కాదు రైల్వే శాఖకు ఫిర్యాదులు కూడా చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా రైల్వే శాఖ అధికారులు రాత్రిపూట ప్రయాణం చేసే పాసింజర్ లను దృష్టిలో పెట్టుకుని కొత్త నిబంధనలు..రూల్స్ తీసుకొచ్చారు. ట్రైన్ లో ప్రయాణం చేసే పాసింజర్ సీట్ లేదా కంపార్ట్మెంట్ ఇంకా కోచ్ లో రాత్రిపూట ఎవరైనా మొబైల్ ద్వారా గట్టిగా మాట్లాడిన.. పెద్దగా సౌండ్ పెట్టి పాటలు విన్న.. కఠిన చర్యలు తీసుకునేలా కొత్త రూల్స్ తెచ్చారు.
ఖచ్చితంగా కంపార్ట్మెంట్ లేదా సీట్ లలో ప్రయాణం చేసే పాసింజర్.. తోటి ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదు అని పేర్కొన్నారు. రాత్రి పది గంటల తర్వాత మొబైల్ లో గట్టిగా మాట్లాడితే కఠిన చర్యలు తప్పవని సంగీతం వినకూడదని భారతీయ రైల్వే శాఖ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఇక ఇదే సమయంలో ప్రయాణికులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే దాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత రైలులో ఉన్న సిబ్బంది దేనని స్పష్టం చేసింది. రాత్రిపూట ట్రైన్ లో ప్రయాణించాల్సిన టైంలో తోటి ప్రయాణికుడికి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా ఉండాలని రైల్వే శాఖ హెచ్చరిస్తోంది. లేకపోతే కఠిన చర్యలు తప్పవని కొత్త రూల్స్ తీసుకురావటం జరిగింది.