NewsOrbit
న్యూస్

Breaking: పంజాబ్ పీసీపీ మాజీ నేత నవజ్యోత్ సింగ్ సిద్దూకు ఏడాది జైలు శిక్ష విధించిన సుప్రీం కోర్టు

Breaking: దాదాపు 30ఏళ్ల క్రితం నాటి కేసులో పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దూకు సుప్రీం కోర్టు ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. 1988 డిసెంబర్ 27న పాటియాలాలోని షెరన్‌వాలా గేటు క్రాసింగ్ వద్ద సిద్దూకు, గుర్నామ్ సింగ్ అనే వృద్ధుడికి మధ్య ఘర్షణ జరిగింది. ఈ గొడవ చిలికిచిలికి గాలివానగా మారింది. ఆ ఘర్షణలో గుర్నామ్ సింగ్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేసులో సిద్దు నేరస్తుడు అనడానికి తగిన ఆధారాలు ఏమీ లేవన్న కారణంతో 2018 మే నెలలో సుప్రీం కోర్టు ఆయనను నిర్ధోషిగా పేర్కొంది. కేవలం వెయ్యి రూపాయలు జరిమానా విధించింది. అయితే ఈ తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసిన బాధిత కుటుంబం. మరో సారి సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో సుప్రీం ధర్మాసనం మరో సారి సిద్ధూ కేసును విచారణ జరిపింది. ఈ కేసులో ఆయనను నేరస్థుడిగా పరిగణించిన సుప్రీం కోర్టు .. ఏడాది జైలు శిక్షతో పాటు వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Breaking: Supreme court sentenced Congress leader Navjot Singh Sidhu
Breaking: Supreme court sentenced Congress leader Navjot Singh Sidhu

Breaking: మూడు దశాబ్దాల తరువాత

కేసు పూర్వాపరాలు ఏమిటంటే.. 1988 డిసెంబర్ 27న పాటియాలాలోని షెరన్‌వాలా గేట్ క్రాసింగ్ సిద్దూ తన జిప్సీని పార్క్ చేసి స్నేహితులతో మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో అక్కడి ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకునేందుకు వెళ్లిన గుర్నామ్ సింగ్ అనే వృద్ధుడు రోడ్డు మీద పార్క్ చేసి ఉన్న జిప్సీని పక్కకు తీయాలని సిద్ధూను కోరారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి వాగ్వివాదం చోటుచేసుకుంది. ఆ ఘర్షణలో గాయాలపాలైన గుర్నామ్ సింగ్ తరువాత ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై బాధితుడి బంధువులు ఫిర్యాదుతో సిద్దు, అతని స్నేహితుడు నంధూపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ జరిపిన ట్రయిల్ కోర్టు 1999 సెప్టెంబర్ నెలలో సిద్ధూను, అతని స్నేహితుడు నంధూను నిర్ధోషులుగా తీర్పు ఇచ్చింది. ట్రయిల్ కోర్టును బాధితులు హైకోర్టులో సవాల్ చేశారు. ఈ కేసు విచారించిన హైకోర్టు ట్రయిల్ కోర్టు తీర్పును పక్కకు పెట్టింది.

తొలుత వెయి రూపాయలు జరిమానా… ఇప్పుడు ఏడాది జైలు

దీనిపై సిద్ధూ అతని స్నేహితుడు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 2007లో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. సిద్దుకు సెక్షన్ 323 కింద వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసులో సిద్ధుకు కేవలం వెయ్యి రూపాయల జరిమామా మాత్రమే విధిస్తూ తీర్పు రావడంపై బాధిత కుటుంబం అభ్యంతరం తెలియజేస్తూ సుప్రీం కోర్టు లో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను విచారించిన జస్టిస్ ఏఎమ్ ఖాన్విల్కర్, ఎస్‌కే కౌలు నేతృత్వంలోని ధర్మాసనం..వెయ్యి రూపాయల జరిమానాతో పాటు ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju