Daggubati Venkateswara Rao: టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత నందమూరి తారక రామారావు పెద్ద అల్లుడు, కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ జాతీయ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు గుండెపోటుతో అస్వస్థతకు గురైయ్యారు. మంగళవారం ఇంట్లో ఉన్న సమయంలో అకస్మాత్తుగా ఛాతినొప్పితో బాధపడుతుండగా వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను అపోలో ఆసుపత్రికి తరలించారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావును పరీక్షించిన వైద్యులు ఆయనకు హార్ట్ స్ట్రోక్ వచ్చినట్లుగా గుర్తించి వెంటనే గుండెకు స్టెంట్ వేశారు. దీంతో ఆయన ప్రాణాపాయం నుండి బయటపడ్డారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
విషయం తెలుసుకున్న టీడీపీ అధినేత, దగ్గుబాటి తోడల్లుడు నారా చంద్రబాబు హుటాహుటిన అపోలో ఆసుపత్రికి వెళ్లి దగ్గుబాటి వెంకటేశ్వరరావును పరామర్శించారు. దగ్గుపాటి ఆరోగ్యంపై చంద్రబాబు అపోలో ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. సకాలంలో ఆసుపత్రికి తీసుకురావడంతో స్టెంట్ అమర్చామనీ, ప్రమాదం ఏమీ లేదని వైద్యులు చంద్రబాబుకు వివరించారు. నందమూరి కుటుంబ సభ్యులు పలువురు ఆసుపత్రికి వెళ్లి దగ్గుబాటి వెంకటేశ్వరరావును పరామర్శించినట్లు సమాచారం.