Director Sujeeth: డైరెక్టర్ సుజిత్ గురించి పరిచయాలు అవసరం లేదు. 2014లో విడుదలైన `రన్ రాజా రన్` మూవీతో దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈయన.. మళ్లీ ఐదేళ్లకు `సాహో`తో ప్రేక్షకులను పలకరించాడు. `బాహుబలి` మూవీతో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్.. తన తదుపరి చిత్రాన్ని సుజిత్ వంటి యంగ్ డైరెక్టర్తో అనౌన్స్ చేయడంలో అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది.
ఇదీ కూడా పాన్ ఇండియా మూవీనే. యువి క్రియేషన్స్, , టీ-సిరీస్ బ్యానర్లపై వంశీ కృష్ణా రెడ్డి, ఉప్పలపాటి ప్రమోద్, భూషన్ కుమార్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించగా.. శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటించింది. భారీ అంచనాల నడుమ 2019 ఆగస్టు 30న రిలీజ్ అయిన ఈ చిత్రం.. తొలి షో నుంచే నెగటివ్ టాక్ను మూటగట్టుకుంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
కానీ, ప్రభాస్ స్టార్ ఇమేజ్ దృష్ట్యా ఈ మూవీ అన్ని భాషల్లోనూ అదిరిపోయే కలెక్షన్లను రాబట్టింది. ముఖ్యంగా బాలీవుడ్లో దుమ్ము దులిపేసింది. నార్త్లోనే రూ. 150 కోట్ల వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం.. వరల్డ్ వైడ్గా రూ. 430 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ నిర్మాతలు, బయ్యర్లకు కొంత మేర నష్టాలు తప్పలేదు.
ఇకపోతే ఈ సినిమాతో విమర్శలపాలైన డైరెక్టర్ సుజిత్కు మరో హీరో అవకాశం ఇవ్వలేదు. అయితే సాహో విడుదలైన మూడేళ్లకు మోక్షం పొందాడీయన. తాజాగా ఓ మెగా హీరో సుజిత్తో సినిమా చేసేందుకు ఇంట్రస్ట్ చూపుతున్నాడట. ఆ హీరో ఎవరో కాదు.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. మరి కొద్ది రోజుల్లోనే సుజిత్ వరుణ్ తేజ్తో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయనున్నాడని ప్రచారం జరుగుతోంది.