ఏపి ముఖ్య మంత్రి వైఎస్ జగన్ సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం లో గృహ నిర్మాణ శాఖ పై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ గృహ నిర్మాణాలు వేగవంతంగా ముందుకు సాాగాలని చెప్పారు. విశాఖలో ఇచ్చిన ఇళ్ల నిర్మాణ పనులు కూడా వేగంగా జరగాలన్నారు. కాలనీల్లో మౌలిక వసతులపై దృష్టి పెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. చేసిన పనులకు నిధులను సక్రమంగా విడుదల చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. విశాఖ లో ఇచ్చిన 1.24 లక్షల ఇళ్ల నిర్మాణ పనుల కు అన్ని రకాలుగా సిద్ధం చేస్తున్నామని అధికారులు వివరించారు. అక్టోబర్ చివరి నాటికి ఇళ్ల నిర్మాణం ప్రారంభం అవుతుందని చెప్పారు. ఆప్షన్ మూడు కింద ఎంపిక చేసుకున్న ఇళ్ల నిర్మాణాలు కూడా వేగంగా సాగుతున్నాయని అధికారులు తెలిపారు.
వివేకా హత్య కేసు నిందితులకు హైకోర్టులో చుక్కెదురు
మరో 15 – 20 రోజుల్లో 1.4 లక్షల టిడ్కో ఇళ్లు సిద్దం అవుతాయని అధికారులు వివరించగా, పూర్తి మౌలిక సదుపాయాలతో లబ్దిదారుల కు ఇళ్లు అందించాలని సీఎం ఆదేశించారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియనూ వేగవంతం చేయాలని చెప్పారు. ఇదే క్రమంలో టిడ్కో ఇళ్ల నిర్వహణ బాగుండేలా మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. కొత్తగా ఇళ్ల పట్టాల కోసం వచ్చిన అర్జీల్లో 2,03,920 మంది అర్హులుగా తేల్చడం జరిగిందనీ, వీటిలో లక్ష మందికి పట్టాలు అందించినట్లు అధికారులు వివరించారు. మిగిలిన వారికి పట్టాలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. పట్టాలు ఇవ్వడమే కాకుండా లబ్దిదారులకు స్థలం ఎక్కడ ఉందో కూడా చూపించాలని సీఎం జగన్ పేర్కొన్నారు.
నందమూరి ఇంట తీవ్ర విషాదం .. ఎన్టీఆర్ నాల్గవ కుమార్తె ఆత్మహత్య