NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

మరో సారి కాన్వాయ్ ఆపి ప్రజల నుండి వినతులు తీసుకున్న సీఎం వైఎస్ జగన్

jyothi paper targeted ys jagan

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో సారి మానవత్వాన్ని చాటుకున్నారు. మంగళవారం అనకాపల్లి పర్యటనకు వెళ్లిన సీఎం జగన్ అచ్యుతాపురం సెజ్ లో టైర్ల పరిశ్రమను ప్రారంభించడంతో పాటు మరో ఎనిమిది కంపెనీలకు భూమి పూజ చేశారు. అనంతరం తిరుగు ప్రయాణంలో విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమారుడు సూర్య, రాశి దంపతులను ఆశీర్వదించేందుకు కాన్వాయ్ లో వెళుతుండగా, రోడ్డు పక్కన ప్రజలు జగన్ కోసం వేచి చూడటం చూసి వెంటనే ఆగారు. కాన్వాయ్ ను ఆపేసి.. కిందకు దిగి తన కోసం ఎదురుచూస్తున్న వారిని పిలిచి వారి సమస్యలను అడిగి తెలుసుకుని వారి నుండి విజ్ఞప్తులను స్వీకరించారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ పక్కనే ఉన్న అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. సీఎం వైఎస్ జగన్ కాన్వాయ్ ఆపించి మరీ తమ సమస్యలు తెలుసుకుని, వినతి పత్రాలు తీసుకోవడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

సీఎం జగన్ కాన్వాయ్ ఆపించి ప్రజల సమస్యలు తెలుసుకోవడం ఇదే ప్రధమం కాదు. ఇంతకు ముందు కూడా పలు సందర్భాల్లో బాధితుల సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి ఆదేశాలు ఇచ్చారు. రీసెంట్ గా కాకినాడ పర్యటనకు వెళ్లిన సమయంలో .. జనాల మధ్య చండిబిడ్డతో ఓ తల్లి ఆవేదనగా అన్నా అన్నా అని పిలుస్తుండటం చూసి వెంటనే తన కాన్వాయ్ ను ఆపారు జగన్. ఆమెను దగ్గరకు పిలిచి వివరాలు తెలుసుకున్నారు. పత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలానికి చెందిన తనూజ తన బిడ్డ అనారోగ్య సమస్య గురించి సీఎం జగన్ కు వివరించగా, వెంటనే వైద్య సహాయం అందించాలని అధికారులకు ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ఆ తర్వాత ఆ బిడ్డకు అవసరమైన వైద్య సహాయం అందించేందుకు చర్యలు చేపట్టారు.

 

తదుపరి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ నివాసానికి వెళ్లి నూతన దంపతులు సూర్య, రాశిలను ఆశీర్వదించారు. ఇటీవల సూర్య, రాశి వివాహం జరిగింది. వీరి రిసెప్షన్ కు సీఎం జగన్ పాల్గొనాల్సి ఉన్నా వాతావరణం అనుకూలించకపోవడంతో వెళ్లలేదు. ఈ రోజు అనకాపల్లి పర్యటన సందర్భంలో సీఎం జగన్.. గణేష్ నివాసానికి వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంలో వాసుపల్లి గణేష్ మాట్లాడుతూ తన ఇంటికి సీఎం జగన్ రావడంతో తన జీవితం ధన్యమైందని అన్నారు. మత్స్యకారుడినైన తన ఇంటికి జగన్ రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ రోజును తాను ఎప్పటికీ గుర్తుంచుకుంటానని పేర్కొన్నారు.

జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం .. ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్

Related posts

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju