Janasena: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపటి నుండి నాలుగు రోజుల పాటు పార్టీ కార్యక్రమాల్లో బిజీగా గడపనున్నారు. ఈ నెల 14వ తేదీ మచిలీపట్నంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ నిర్వహిస్తున్న నేపథ్యంలో రేపు పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయానికి చేరుకోనున్నారు. పార్టీ కార్యాలయంలో పలు ముఖ్య సమావేశాలు, సమీక్షల్లో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. రేపు పార్టీ కార్యాలయానికి చేరుకున్న తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు బీసీ సంక్షేమంపై రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. ఎల్లుండి 12వ తేదీ ఉదయం 11 గంటలకు పార్టీ రాష్ట్ర నాయకులతో సమీక్ష, పార్టీలో చేరికల కార్యక్రమంలో పాల్గొననున్నారు.
మధ్యాహ్నం 2 గంటలకు మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య నేతృత్వంలో కాపు సంక్షేమ సేన ప్రతినిధులతో భేటీ కానున్నారు. 13 వ తేదీ ఉదయం 11 గంటలకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాల నిర్వహణపై సమీక్ష నిర్వహిస్తారు పవన్ కళ్యాణ్. సాయంత్రం 5 గంటలకు పవన్ కళ్యాణ్ విజయవాడ రాజ్ భవన్ కు చేరుకుని గవర్నర్ అబ్దుల్ నజీర్ ను మార్యాద పూర్వకంగా కలవనున్నారు. 14వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు మంగళగిరి పార్టీ కార్యాలయం నుండి వారాహి వాహనంతో మచిలీపట్నం సభకు బయలుదేరనున్నారు. సాయంత్రం 5 గంటలకు మచిలీపట్నం సభా ప్రాంగణానికి చేరుకుని బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
CBI Court: వైఎస్ వివేకా హత్య కేసు ఈ నెల 31వ తేదీకి వాయిదా