హైదరాబాద్ నగరంలో కరోనా వైరస్ ఏ రకంగా విజృంభిస్తుందో మన అందరం చూస్తూనే ఉన్నాం. అయితే కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ నుండి మినహాయింపులు ఇచ్చిన తర్వాత అక్కడ ఇంకా భారీ ఎత్తున కేసులు నమోదు కావడం గమనించదగ్గ విషయం. ఇటువంటి సందర్భంలో నగరవాసులకు మరొక షాక్ ఇస్తూ ప్రసిద్ధ గోకుల్ చాట్ యొక్క యజమానికి కరోనా పాజిటివ్ అని తేలడంతో వెంటనే దానిని మూసివేయ వలసి వచ్చింది.
చాలా సంవత్సరాల క్రితం హైదరాబాద్ లో జరిగిన జంట పేలుళ్ల ఘటన లో లుంబినీ పార్క్ తో పాటు గోకుల్ చాట్ కూడా ఒక సంఘటన స్థలం కావడంతో దీని పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది.
అయితే ఇప్పుడు ఏకంగా దాని యజమానికి కరోనా పాజిటివ్ అని రావడంతో ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిన కస్టమర్లు భయంతో వణికి పోతున్నారు. అంతేకాకుండా అక్కడ పనిచేసే 20 వర్కర్లను ఇప్పటికే క్వారంటైన్ కు పంపేశారు.