TDP BJP Alliance: ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేడి ప్రారంభమైంది. ప్రధాన రాజకీయ పక్షాలు అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. ఓ పక్క టీడీపీ – జనసేన పొత్తులో ఉండగా, బీజేపీ ఈ కూటమిలో చేరుతుందా లేదా అన్న దానిపై ఇంకా క్లారిటీ లేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మాత్రం తమ పొత్తు ప్రస్తుతానికి జనసేనతో మాత్రమే ఉందని, ఇక పొత్తుల విషయంపై నిర్ణయాధికారి పార్టీ అధిష్టానందేనని చెబుతున్నారు. అయితే రీసెంటర్ గా ఓ బీజేపీ నేత పొత్తులపై అడిగిన సీట్ల లెక్క చూస్తే ఇక టీడీపీ అధినేత చంద్రబాబు బిషాణ సర్దేసుకోవాల్సిందేనా అని నెటిజన్ లు సెటైర్ లు వేస్తున్నారు.
బీజేపీ కేంద్ర నాయకత్వం నుండి ఇప్పటి వరకూ సానుకూల సంకేతాలు లేకపోయినా టీడీపీ మాత్రం ఎన్డీఏ కూటమిలో చేరాలన్న ఆశతోనే ఉంది. కేంద్రంలోని బీజేపీకి రాష్ట్రంలోని అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు అనధికార మిత్రపక్షంగానే ఉన్నాయి. దేశంలోని విపక్ష పార్టీలు కేంద్రంలో మోడీ నేతృత్వంలోని బీజేపీ విధానాలను విమర్శిస్తున్నా, ఆరోపణలు చేస్తున్నా ఏపీలోని టీడీపీ, వైసీపీ అధినేతలు మాత్రం మోడీ నాయకత్వాన్ని పల్లెత్తు మాట అనకుండా స్నేహపూర్వకంగా కొనసాగుతూ ఉన్నారు. దీంతో ఏపీలో ఎవరికి ఎన్ని పార్లమెంట్ స్థానాలు వచ్చినా మొత్తం గుండుగుత్తగా 25 మంది లోక్ సభ సభ్యుల మద్దతు ఎన్డీఏకే ఇచ్చే అవకాశం ఉండటంతో ఎవరిని దూరం చేసుకోకుండా నెట్టుకొస్తొంది కేంద్రంలోని బీజేపీ.
ఆ కారణం వల్లనే పొత్తు కోసం టీడీపీ వెంపర్లాతున్నా సానుకూల సంకేతాలు ఇవ్వడం లేదన్న టాక్ నడుస్తొంది. అయితే తాజాగా బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి పొత్తు అంశంపై మాట్లాడిన మాటలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు తెరలేపింది. తమకు 75 అసెంబ్లీ, 12 ఎంపీ స్థానాలు ఇస్తేనే పొత్తు అంటూ విష్ణువర్థన్ రెడ్డి ప్రకటించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఒక్క శాతం ఓట్లు కూడా రాలేదు. స్థానక సంస్థల ఎన్నికల్లోనూ, అసెంబ్లీ, పార్లమెంట్ ఉప ఎన్నికల్లో ప్రభావవంతంగా ఓట్లు సాధించిందీ లేదు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు కింద 18 అసెంబ్లీ, నాలుగు ఎంపీలు తీసుకున్న బీజేపీ..13 స్థానాల్లో మాత్రమే అభ్యర్ధులను నిలబెట్టుకుంది. నాలుగు అసెంబ్లీ, రెండు లోక్ సభ స్థానాల్లో గెలిచింది. పొత్తులో 18 అసెంబ్లీ సీట్లు ఇస్తేనే అభ్యర్ధులు నిలబెట్టుకునే పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు ఏకంగా 75 స్థానాలు ఇవ్వాలని డిమాండ్ పెట్టడం ఆ పార్టీ నేతలే నవ్వుకుంటున్నారుట. ఒక్క శాతం ఉన్న బీజేపీ 175 లో 75 స్థానాలు అడిగితే .. గత ఎన్నికల్లో ఆరు శాతం ఓట్లు సాధించిన జనసేన వందో , 125 కో అడిగే అవకాశం ఉంటుంది. అప్పుడు టీడీపీకి పోటీ చేయడానికి అసెంబ్లీ స్థానాలే ఉండవు కాబట్టి ఇక బాబు గారు బిషాణ ఎత్తేసుకోవాల్సిందేనని నవ్వుకుంటున్నారు.
ISRO: నూతన సంవత్సరం తొలి రోజు నింగిలోకి పీఎస్ఎల్వీ సీ 58 రాకెట్