NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఏపీ సీఎం జగన్ కీలక ప్రకటన

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి కీలక ప్రకటన చేశారు. రాబోయే రోజుల్లో విశాఖ పాలనా రాజధానిగా మారబోతోందనీ, తాను కూడా అక్కడి నుంచే పాలన కొనసాగించనున్నట్లు సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. విశాఖ రాజధానిలో పెట్టుబడులకు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. విశాఖ వేదికగా మార్చిలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు నిర్వహించనున్న నేపథ్యంలో ఇవేళ ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్ నందు సన్నాహక సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో పాల్గొన్న ఇన్వెస్టర్లను ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగిస్తూ.. ఏపిలో పెట్టుబడులు పెట్టిన వాళ్లందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం తరపున ఎలాంటి సహకారం అందించేందుకైనా సిద్దమని ప్రకటించారు.

AP CM YS Jagan

 

ప్రపంచ వేదికపై ఏపిని నిలబెట్టేందుకు ఇన్వెస్టర్ల సహకారం అవసరమన్నారు సీఎం వైఎస్ జగన్ . ఈ విషయంలో ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపి గత మూడేళ్లుగా నెంబర్ వన్ గా ఉంటోందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏపిలో పెట్టుబడులకు ఉన్న అనుకూల పరిస్థితులను సీఎం జగన్ ఇన్వెస్టర్లకు వివరించారు.  పారిశ్రామిక వేత్తలు ఇచ్చి ఫీడ్ బ్యాక్ తోనే తాము నెంబర్ వన్ గా ఉన్నామని చెప్పారు. ఏపికి సుదీర్ఘ తీర ప్రాతం ఉందని తెలిపారు. 11.43 శాతం వృద్ది రేటుతో దేశంలోనే వేగంగా వృద్ధి చెందుతోందని అన్నారు. దేశ వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న 11 ఇండస్ట్రియల్ కారిడార్ లలో మూడు ఏపికే రావడం శుభపరిణామని పేర్కొన్నారు. సింగిల్ డెస్క్ సిస్టమ్ ద్వారా 21 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నామని సీఎం జగన్ తెలిపారు.

AP CM YS Jagan Global investors meeting
AP CM YS Jagan Global investors meeting

 

ఏపి ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడులకు అద్భుత అవకాశాలు ఉన్నాయన్నారు. బల్క్ డ్రగ్, స్పైస్ పరిశ్రమల నెలకొల్పేందుకు మంచి అనుకూల వాతావరణం ఉందని చెప్పారు. నైపుణ్యం ఉన్న మానవ వనరులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. నిరంతర విద్యుత్, ల్యాండ్ బ్యాంక్ సమృద్ధిగా ఉందని వివరించారు.

AP CM YS Jagan Global investors meeting

 

ఈ సదస్సులో పలువురు పారిశ్రామిక వేత్తలు ఏపి ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని ప్రశంసించారు. ఇండియా సెయింట్ గోబైన్ సీఈఓ బి సంతానం, ఎవర్టన్ టీ ఇండియా డైరెక్టర్ రోషన్ గణవర్థన, టోరే ఇండస్ట్రీస్ ఎండీ యమగూచి, క్యాడ్ బరీ ఇండియా ప్రెసిడెంట్ దీపక్, కియా మోటర్స్ ఎండీ, సీఈఓ తాయి జిన్ తదితరులు తమ సంతృప్తిని వ్యక్తం చేశారు.

Breaking: అచ్చుతాపురం సెట్ లో భారీ పేలుడు .. ఒకరు మృతి

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju