ఏపీ సీఎం వైఎస్ జగన్ పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో బుధవారం అమ్మఒడి పథకం నిధుల విడుదల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ పది రోజుల పాటు పండుగలా జగనన్న అమ్మ ఒడి కొనసాగుతోందన్నారు. అన్ని స్కూల్స్, కాలేజీల విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో అమ్మఒడి నిధులు జమ అవుతున్నాయన్నారు. అవినీతి, వివక్ష లేకుండా నేరుగా నిధులు అందజేస్తున్నామని పేర్కొన్నారు. తల్లులు తమ పిల్లలను బడికి పంపించేందుకే అమ్మఒడి పథకం ప్రవేశపెట్టామనీ, ప్రపంచ స్థాయిలో పిల్లలు పటీ పడేలా తీర్చిదిద్దుతున్నామన్నారు. ప్రపంచాన్ని ఏలే పరిస్థితికి మన పిల్లలు రావాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని, వచ్చే తరం మనకంటే బాగుండాలనే ఉద్దేశంతో పని చేస్తున్నామని అన్నారు.
పాఠశాలలో రోజుకో మెనూతో విద్యార్ధులకు గోరుముద్ద అందిస్తున్నామని తెలిపారు. పిల్లలకు తొలి సారిగా బైలింగ్యూల్ పుస్తకాలు అందజేస్తున్నామనీ, పిల్లలకు సులువుగా అర్ధమయ్యేందుకు డిజిటల్ బోధనను తీసుకొచ్చామని తెలిపారు. ప్రభుత్వ, ఎటుడెడ్, ప్రైవేటు పాఠశాలల విద్యార్ధులకు ఒమ్మఒడి అందిస్తున్నామని చెప్పారు. అమ్మఒడి కింద ఇప్పటి వరకూ రూ.26,067,28 కోట్లు అందజేశామని తెలిపారు. అంగన్ వాడీల్లోనూ సంపూర్ణ పోషణ పథకం అమలు చేస్తున్నామని వివరించారు. నాడు – నేడు ద్వారా 45వేల ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చామన్నారు. డిజిటల్ విద్యను ప్రోత్సహిస్తూ పిల్లలకు ట్యాబ్ లు కూడా అందించామని అన్నారు. ఆడ పిల్లల కోసం స్వేచ్చ పథకం అమలు చేస్తున్నామని తెలిపారు.
విదేశాల్లో పెద్ద చదువుల కోసం విద్యార్ధులకు ఎక్కడ సీటు వచ్చినా కోటి 25 లక్షల రూపాయలు అందజేస్తున్నామని చెప్పారు. ఏపిలో నాలుగేళ్లలో విప్లవాత్మక మార్పులు కనిపిస్తున్నాయన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అమ్మఒడి అమలవుతోందని అన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాథ్యమం తీసుకొచ్చామని, పాఠశాలలు ప్రారంభమైన వెంటనే మెరుగైన విద్యాకానుక కిట్లు అందజేస్తున్నామన్నారు. మన పిల్లలను గ్లోబల్ సిటిజన్స్ గా తయారు కావాలన్నదే లక్ష్యమని అన్నారు. అంతే కాకుండా ఆడ పిల్లల కోసం కళ్యాణ మస్తు, షాదీ తోషా అమలు చేస్తున్నామని వివరించారు. 2022 – 23 విద్యాసంవత్సరానికి గానూ అమ్మఒడి కింద 42,61,965 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,392.94 కోట్లు జమ చేస్తున్నారు.
చంద్రబాబు నీడ నుండి పవన్ బయటకు రావాలని సూచించిన లక్ష్మీపార్వతి