AP CM YS Jagan: నెల్లూరు నగర పాలక సంస్థతో పాటు 12 మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు బుధవారం వెల్లడి అయ్యాయి. నెల్లూరు నగర పాలక సంస్థలో మునుపెన్నడూ లేని విధంగా మొత్తం డివిజన్ లు వైసీపీ కైవశం చేసుకుని క్లీన్ స్వీప్ చేయగా, మున్సిపాలిటీల విషయానికి వస్తే ప్రకాశం జిల్లా దర్శి, కృష్ణాజిల్లా కొండపల్లి మినహా మిగిలిన పది మున్సిపాలీటీలు వైసీపీ కైవశం చేసుకున్న విషయం తెలిసిందే. దర్శి టీడీపీ కైవశం చేసుకోగా, కొండపల్లి లో మాత్రం వైసీపీ, టీడీపీ సమానంగా వార్డులు గెలుచుకున్నాయి. టీడీపీ 14, వైసీపీ 14 వార్డులు గెలుచుకోగా, ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్ధిని విజయం సాధించారు. స్వతంత్ర అభ్యర్ధిగా గెలిచిన శ్రీదేవి మైలవరం టీడీపీ ఇన్ చార్జి దేవినేని ఉమామహేశ్వరరావుతో కలిసి చంద్రబాబు వద్దకు వెళ్లి టీడీపీలో చేరారు. దీంతో టీడీపీ బలం 15కు చేరింది. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ ఎక్స్ అఫిషియో సభ్యుడుగా పాల్గొనే అవకాశం ఉన్నందున వైసీపీ బలం కూడా 15కు చేరుకుంటుంది. దీంతో చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇదిలా ఉండగా మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయాలు నమోదు చేసుకోవడంపై వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు.
Read More: Viveka Murder Case: వివేకా హత్య కేసులో మరో కీలక వ్యక్తి అరెస్టు..?
AP CM YS Jagan: వైసీపీ ప్రభుత్వానికి 97 మార్కులు
ప్రజలకు ఈ సందర్భంగా సీఎం జగన్ ధన్యావాదాలు తెలియజేశారు. ప్రభుత్వానికి ప్రజలు 100 కి 97 మార్కులు వేశారన్నారు. దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు ..ఇవే ఈ రోజు ఇంతటి ఘన విజయాన్ని అందించాయన్నారు. గ్రామంతో పాటు నగరం కూడా పని చేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలిచిందన్నారు. మున్సిపాలిటీలు, కార్పోరేషన్లు, నగర పంచాయతీల్లో వందకు 97 మార్కులు వేసిన అవ్వా చెల్లెళ్లు, సోదరులదరికీ ధన్యవాదాలు అంటూ జగన్ ట్వీట్ చేశారు.