NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Govt: ఏపి అసైన్డ్ చట్టంలో కీలక సవరణలు..! ఆర్డినెన్స్ జారీ చేసిన సర్కార్..! పదేళ్లకే పూర్తి హక్కులు..!!

ZP Chairman Elections: YS Jagan Serious Warning to Ministers

AP Govt: పేదలకు ఇచ్చే ఇంటి స్థలాలపై పదేళ్ల తర్వాత పూర్తి స్థాయి హక్కులు కల్పించేలా రాష్ట్ర అసైన్‌మెంట్ చట్టంలో కీలక సవరణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. దీనిపై ఇప్పటికే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేయడంతో న్యాయశాఖ మంగళవారం రాత్రి అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఆర్డినెన్స్ ఇచ్చింది.

AP Govt issued the ordinance with amendments in the Assigned Act
AP Govt issued the ordinance with amendments in the Assigned Act

ఇటీవల సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన జరిగిన కెబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకు ఇంటి స్థలాలపై పూర్తి హక్కులు ఇచ్చే గడువును 20 ఏళ్ల నుండి పదేళ్లకు కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని నిరుపేదలకు ఏపి అసైన్‌మెంట్ చట్టం (పీవోటీ) -1977 ప్రకారం డీకేటీ పట్టాల ద్వారా ఇంటి స్థలాలు కేటియిస్తున్న సంగతి తెలిసిందే. అయితే స్థలం ఇచ్చిన సంవత్సరంలోపు ఇల్లు కట్టుకోవాలన్న నిబంధనలు ఉన్నాయి. పట్టా పేదల పేరిట ఉన్నా ఆ భూమిపై 20 సంవత్సరాల పాటు ప్రభుత్వానికే పూర్తి హక్కులు ఉంటాయి. అంటే ఈ గడువులోగా లబ్దిదారులు ఇంటి స్థలాలు లేదా నిర్మించిన ఇళ్లను స్థలంతో సహా అమ్ముకోవడానికి వీలులేకుండా కఠినమైన నిబంధలు విధించారు. అయితే చిన్న చిన్న ఆర్థిక అవసరాలకు కూడా పేదలు ఈ స్థలాలను అమ్ముకుంటున్నారని, మళ్లీ సొంత ఇల్లు కోల్పోయి నష్టపోతున్నారని భావించిన ప్రభుత్వం 2019లోనే ఏపి అసైన్మెంట్ చట్టంలో సవరణలు ప్రతిపాదించి 20 ఏళ్ల గడువు విధించింది. ఇప్పుడు ఈ గడువును పదేళ్లకే కుదించాలని, అన్యాక్రాంతమైన, పరాధీనమైన, అమ్ముకున్న భూములను నిబంధనలకు లోబడి క్రమబద్దీరకరించాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు లేనందున ఆర్డినెన్స్ తీసుకొచ్చింది.

ZP Chairman Elections: YS Jagan Serious Warning to Ministers

పేదింటి స్థలాలపై గడువును పదేళ్లకు కుదించడం వల్ల ఇటు ప్రభుత్వానికి, అటు లబ్దిదారులకు ప్రయోజనం కలుగుతుంది. క్రమబద్దీకరణ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ప్రస్తుతం ఏపి అసైన్మెంట్ చట్టం ప్రకారం డీకేటీ పట్టాల ద్వారా స్థలం పొందిన ఇంటి స్థలాలను 20 సంవత్సరాల పాటు అమ్ముకోవడం, కొనుగోలు చేయడం నేరం, ఆర్డినెన్స్ ద్వారా గడువును పదేళ్లకు కుదించారు. అంటే పదేళ్ల గడువు తీరిన తరువాత పేదలకు ఆ ఇంటి స్థలంపై పూర్తి స్థాయి హక్కులు వస్తాయి. ఈ స్థలాలను వారు అమ్ముకోవచ్చు, ఎవరైనా కొనుగోలు చేయవచ్చు. దీని వల్ల పేదలకు మేలు జరుగుతుంది. నిర్ధిష్ట గడువు తీరి పూర్తి హక్కులు పొందిన వారికి, ముందుగానే అనధికారికంగా కొనుగోలు చేసినవారికి క్రమబద్దీకరణ అప్షన్ కూడా ప్రభుత్వం ఇచ్చింది. గడువుకు ముందే ఎవరైనా డీకేటీ పట్టాలు కొనుగోలు చేసి ఉంటే వాటిని పదేళ్ల కాలపరిమితి తీరితే ఇప్పుడు వాటిని క్రమబద్దీకరించుకోవచ్చు. ఇందు కోసం ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు చెల్లించి రెగ్యులరైజేషన్ చేసుకోవచ్చు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju