AP Three Capitals: రాష్ట్రంలో రాజధాని అంశం హాట్ టాపిక్ నడుస్తోంది. ప్రభుత్వం, వైసీపీ మూడు రాజధానులకు అనుకూలంగా వ్యవహరిస్తుండగా, టీడీపీతో సహా ఇతర రాజకీయ పక్షాలు అన్నీ అమరావతినే రాజధానిగా కొనసాగిస్తూ మూడు ప్రాంతాలను అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి. తిరుపతిలో నిన్న అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అమరావతి రైతు జేేఏసి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించగా, అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా రాయలసీమ మేధావుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నేడు తిరుపతి తుడా ఇందిరా మైదానంలో భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభలో రిటైర్డ్ న్యాయమూర్తులు, ప్రొఫెసర్లు, రచయితలు, మేథావులు పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అభివృద్ధి ఒకే చూట కేంద్రీకృతం కారాదని నేతలు ప్రసంగాలు చేశారు. ఈ సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు, మహిళలు, విద్యార్ధినీ విద్యార్ధులు హజరైయ్యారు.
AP Three Capitals: అమరావతిలోనే రాజధాని
అయితే సభకు హజరైన పలువురు మహిళలను ఓ టీవీ ఛానల్ రాజధాని ఎక్కడ ఉండాలని ప్రశ్నించగా వారు అమరావతిలోనే రాజధాని ఉండాలని పేర్కొని ట్విస్ట్ ఇచ్చారు. సభకు హజరు కావాలని వైసీపీ నేతల నుండి సమాచారం రావడంతో వచ్చామని పలువురు డ్వాక్రా మహిళలు పేర్కొన్నారు .రాష్ట్రంలోని 13 జిల్లాలకు సెంటర్ పాయింట్ గా ఉన్న అమరావతి రాజధానిగా ఉంటేనే మేలు అని సభకు హజరైన మహిళలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కాగా అభివృద్ధి వికేంద్రీకరణ, రాయలసీమ అభివృద్ధి ఆవశ్యకతపై వక్తలు ప్రసంగించారు. ఈ సందర్భంగా 13 డిమాండ్ లు చేసారు. రాయలసీమ అధ్యనాల సంస్థ అధ్యక్షుడు భూమన్ (తిరుపతి), రాయలసీమ మహాసభ అధ్యక్షుడు, రచయిత శాంతి నారాయణ (అనంతపురం), రాయలసీమ కార్మిక, కర్షక సమితి అధ్యక్షుడు సీహెచ్ చంద్రశేఖర్ రెడ్డి (కడప), కుందూ పోరాట సమితి అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి (కర్నూల్) పాల్గొన్నారు.
ప్రధాన డిమాండ్ లు..
- కార్యనిర్వహక రాజధానిగా విశాఖ కొనసాగించాలి
- ఉప సచివాలయాలను రాయలసీమ, అమరావతిలో ఏర్పాటు చేయాలి
- న్యాయ రాజదానిగా కర్నూలును కొనసాగించాలి
- హైకోర్టు బెంచ్ ఉత్తరాంధ్ర, అమరావతిలో ఏర్పాటు చేయాలి
- శాసనరాజధానిగా అమరావతిని కొనసాగించాలి
- విశాఖ, రాయలసీమలో ఏటా ఒక సారి శాసనసభ సమావేశాలు నిర్వహించాలి