Big Breaking: కాకినాడ మేయర్ సుంకర పావనిపై మెజార్టీ కార్పోరేటర్ లు అవిశ్వాసం ప్రకటించారు. శుక్రవారం 33 మంది కార్పోరేటర్ లు శుక్రవారం కలెక్టర్ హరికిరణ్ ను కలిశారు. ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ కార్పోరేటర్ లు కలెక్టర్ నోటీసు అందజేశారు. మేయర్ సుంకర పావనితో పాటు డిప్యూటి మేయర్ 1 సత్తిబాబుపైనా వారు అవిశ్వాసం ప్రకటించారు. 21 మంది టీడీపీ అసమ్మతి కార్పోరేటర్ లతో పాటు 12 మంది వైసీపీ కార్పోరేటర్లు కలెక్టర్ ను కలిసిన వారిలో ఉన్నారు.
ఈ నెల 15వ తేదీతో సుంకర పావని మేయర్ గా బాధ్యతలు స్వీకరించి నాలుగేళ్లు పూర్తి అయ్యింది. 2019 అసెంబ్లీ ఎన్నికల తరువాత రాష్ట్రంలో అధికార మార్పిడితో కాకినాడ కార్పోరేషన్ లో వైసీపీ బలం పెరిగింది. 32 మంది టీడీపీ కార్పోరేటర్లలో 21 మంది వైసీపీ గూటికి చేరారు. దీంతో వైసీపీ బలం 35కి చేరింది. మున్సిపల్ చట్టాల ప్రకారం మేయర్, డిప్యూటి మేయర్ లపై అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే వాళ్ల పదవీ కాలం నాలుగేళ్లు పూర్తి కావాల్సి ఉంటుంది. ఈ నెల 15వ తేదీతో వారి నాలుగేళ్ల పదవీ కాలం పూర్తి అయ్యింది. ఈ నేపథ్యంలో వైసీపీ, టీడీపీ అసమ్మతి కార్పోరేటర్లు 33 మంది కలిసి జిల్లా కలెక్టర్ ను కలిసి అవిశ్వాస తీర్మానం నోటీసు అందజేసి త్వరలో మున్సిపల్ కార్పోరేషన్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు.