Breaking: ఏపి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన జరిపిన కేబినేట్ భేటీ ముగిసింది. ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంది. మొత్తం 42 అంశాలపై కేబినెట్ లో చర్చించారు. ప్రధానంగా ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా తీవర సంచలనం అయిన కోనసీమ జిల్లా పేరు మార్పు అంశంపై కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్పు ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్పు ప్రతిపాదనపై నెల రోజుల క్రితం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసి ప్రజల నుండి అభ్యంతరాలు, సలహాలు, సూచనలు తీసుకున్న క్రమంలో జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ అమలాపురంలో పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే. ఆ సందర్భంలో ఆందోళనకారులు మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ ఇళ్లను దగ్దం చేసి విధ్వంసాలను సృష్టించారు. ఆందోళనకు కారణమైన వంద మందికిపైగా యువకులపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయడం కూడా జరిగింది. అయితే జిల్లా పేరు మార్పు అంశంపై అభ్యంతరాల స్వీకరణ గడువు ముగియడంతో ప్రభుత్వం ఎట్టకేలకు నిర్ణయం తీసుకుంది.
అదే విధంగా ఈ కేబినెట్ బేటీలో 27న అమలు చేయబోతున్న మూడవ విడత అమ్మ ఒడి పథకానికి ఆమోదం తెలిపింది. 15వేల కోట్లతో ఏర్పాటు కానున్న గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు కు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సహాక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కూడా చర్చించి కేబినెట్ ఆమోదం తెలిపింది. జూలై నెలలో అమలు చేయనున్న జగనన్న విద్యాకానుక, వైఎస్ఆర్ వాహన మిత్ర, కాపు నేస్తం తదితర పథకాలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.