Breaking: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందగా 15 మంది గాయపడ్డారు. పెద్దవడుగూరు మండలం మిడుతూరు వద్ద ఆగి ఉన్న లారీని బెంగళూరు నుండి హైదరాబాద్ వెళుతున్న బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీలో ఒకరు, బస్సులో ఇద్దరు మృతి చెందగా..15 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
Breaking: అనంతపురం ఆసుపత్రిలో క్షతగాత్రులకు చికిత్స
వీరిలో తీవ్రంగా గాయపడిన ఆరుగురిని ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం తెలసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్ల ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.