YSRCP: ఏపీలో పొత్తు రాజకీయాలు, రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే అంశంపై రాజకీయ వర్గాల్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని విధంగా నవరత్నాలు పేరిట సంక్షేమ పథకాలను అమలు చేస్తూ లబ్దిదారుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేస్తున్నందున ప్రజల ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారని, మరల వైసీపీనే అధికారంలోకి రావడం పక్కా అని ఆ పార్టీ నేతలు ఘంటాపథంగా చెబుతున్నారు. రాష్ట్రంలో బలంగా ఉన్న వైసీపీని ఎదుర్కోవాలంటే ప్రతిపక్షాలతో కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఉందని టీడీపీ – జనసేన భావిస్తున్నాయి. జనసేన – టీడీపీ పొత్తు దాదాపు ఖరారు అయ్యింది. అయితే ఈ కూటమితో బీజేపీ కలుస్తుందా లేదా అనే దానిపై ఇంత వరకూ స్పష్టత లేదు.
టీడీపీ, జనసేనతో పొత్తు పెట్టుకుంటే ఒకటి రెండు స్థానాలు అయినా గెలవవచ్చని, మళ్లీ బోణీ కొట్టవచ్చనే ఆశలో వామపక్షాలు ఉన్నాయి. రాష్ట్ర విభజన తర్వాత అసెంబ్లీలో వామపక్షాలకు ప్రాధాన్యత లేకుండా అయిపోయింది. కాంగ్రెస్ తో పాటు వామపక్షాలకు ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా ఏపీ అసెంబ్లీలో పరిస్థితి ఉంది. అయితే టీడీపీ, జనసేన ఈ రెండు పార్టీలు బీజేపీతో కలిసి ప్రయాణం చేయాలన్న ఆలోచనతో ఉండటం వామపక్షాలకు మింగుడు పడని అంశంగా ఉంది. ఏపీలో రాజకీయ పరిస్థితులు ఈ విధంగా ఉండగా, పొత్తు రాజకీయాలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.
తాము టీడీపీతో కలవాలని భావిస్తున్నా ఆ పార్టీ మాత్రం పక్క చూపులు చూస్తొందని వ్యాఖ్యానించారు నారాయణ. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీపీఐ నారాయణ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ రాజకీయాల గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో సీపీఐ పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి దారుణాతి దారుణంగా ఉండటంతో టీడీపీతో పొత్తునకు సీబీఐ ప్రయత్నిస్తొంది. ఇదే విషయాన్ని ఆయన వెల్లడించారు. తాము టీడీపీతో కలవాలని అనుకుంటున్నామనీ, అయితే ఆ పార్టీ పక్క చూపులు చూస్తొందన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మధ్యవర్తిత్వం వహిస్తూ బీజేపీతో టిడీపీని కలిపే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అయితే ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన లు కలిసి పోటీ చేస్తే మాత్రం మళ్లీ వైఎస్ జగన్ అధికారంలోకి రావడం ఖాయమని అని అన్నారు. ఒక వేళ టీడీపీ గనుక బీజేపీతో కలవకుంటే మాత్రం తాము మద్దతు ఇస్తామని నారాయణ తెలిపారు.
ఇదే సందర్బంలో చంద్రబాబు అరెస్టు, బెయిల్ పరిణామాలపైనా సంచలన కామెంట్స్ చేశారు. చంద్రబాబుకు లభించింది అన్ అఫీషియల్ కండిషన్ బెయిల్ అని అన్నారు. బీజేపీ అగ్రనేత అమిత్ షా ను నారా లోకేష్ కలిసిన తర్వాతనే పరిణామాలు మారాయని చెప్పారు. షా వల్లనే చంద్రబాబుకు బెయిల్ వచ్చిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు మళ్లీ ఎప్పుడైనా అరెస్టు కావొచ్చని వ్యాఖ్యానించారు నారాయణ.
Qatar: నేవీ మాజీ అధికారులకు బిగ్ రిలీఫ్ .. మరణశిక్ష రద్దుకై భారత్ విజ్ఞప్తిని ఆమోదించిన ఖతార్ కోర్టు