Mandali Buddha Prasad: పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి సన్నిధిలో పార్టీల నేతలు రాజకీయ విమర్శలు, ఆరోపణలు చేయడం జరుగుతుంటోంది. కొందరు నేతలు మాత్రం మీడియా రాజకీయాలపై ప్రశ్నించగా పవిత్ర పుణ్యక్షేతం ఇక్కడ తగదు అంటూ తప్పుకుంటుంటారు. తిరుమలలో రాజకీయ ఆరోపణలు, విమర్శలు చేయవద్దన్న డిమాండ్ ఎప్పటి నుండో వస్తుంది. కానీ దీనిపై టీటీడీ అధికారికంగా ఇంత వరకూ నిషేదం విధించలేదు. దీంతో రాజకీయ నాయకులు శ్రీవారి దర్శనం కోసం వచ్చిన సందర్భంలో మీడియా కనబడటంతో ఏదేదో మాట్లాడుతుండటం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మాజీ డిప్యూటి స్పీకర్ మండలి బుద్ద ప్రసాద్ టీటీడీకి దీనిపై కీలక సూచన చేశారు.
Read More: AP CM YS Jagan: ఎయిడెడ్ విద్యాసంస్థల యాజమాన్యాలకు సీఎం జగన్ గుడ్ న్యూస్..!!
Mandali Buddha Prasad: తిరుమలలో రాజకీయాలు మాట్లాడవద్దు
కుమారుడి వివాహ వేడుక అనంతరం ఆయన మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆయన ప్రస్తుత రాజకీయాలపై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పవిత్ర శ్రీవారి క్షేత్రంలో రాజకీయ ఆరోపణలు, విమర్శలపై టీటీడీ నిషేదం విధించాల్సిన అవసరం ఉందని మండలి అభిప్రాయపడ్డారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చే రాజకీయ పార్టీ నేతలు తిరుమలలో రాజకీయాలు మాట్లాడకుండా టీటీడీ గట్టి చర్యలు తీసుకోవాలని మండలి బుద్ద ప్రసాద్ సూచించారు.
Read More: AP High Court: ఆనందయ్య కరోనా మందుపై హైకోర్టు కీలక ఆదేశాలు..!!
పాలకులకు మంచి బుద్ది ప్రసాదించాలి
తిరుమల శ్రీవారి క్షేత్రం చాలా పరిత్రమైనదని, ఇలాంటి చోట రాజకీయ ఆరోపణలు, విమర్శలు చేయడం సరికాదని ఆయన అన్నారు. కానీ కొందరు రాజకీయ నాయకులు వ్యక్తిగత ప్రచారం కోసం తిరుమలలో రాజకీయాల గురించి మాట్లాడుతున్నారని మండలి అన్నారు. అలాంటి వారిపై టీ టీ డీ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అవసరమైతే శ్రీవారి క్షేత్రంలో రాజకీయాలు మాట్లాడకుండా నిషేదం విధించాలని ఆయన సూచించారు. ఇక ప్రస్తుత రాజకీయాలపై స్పందిస్తూ మధుర భాష్యంతో మధురమైన జీవనం గడిపేలా పాలకులకు మంచి బుద్ది ప్రసాదించాలని శ్రీవారిని కోరుకున్నట్లు బుద్ద ప్రసాద్ తెలిపారు.
మండలి బుద్ద ప్రసాద్ సూచనలపై టీటీడీ అధికారులు, చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.
Read More: MP RRR: జస్టిస్ గత వ్యాఖ్యలతో జగన్ కి ఇబ్బందులే..!? రెబల్ ఎంపీ కీలక అడుగు..!