Ayyanna Patrudu: అనకాపల్లి జిల్లాలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుపై మరో కేసు నమోదు అయ్యింది. పోలీసులపై దుర్భాషలాడి దుసురుసుగా ప్రవర్తించారన్న అభియోగంపై 304, 305, 188, 204 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. రెండు రోజుల క్రితం నర్సీపట్నం గ్రామ దేవత ఉత్సవాలు (జాతర) జరుగుతున్న సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అయితే సాంస్కృతి కార్యక్రమాలు రాత్రి 11 గంటల తరువాత జరపడానికి వీల్లేదని పోలీసులు ఆదేశించారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Ayyanna Patrudu: పోలీసులు, టీడీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట
గతంలో ఎన్నడూ లేని విదంగా పోలీసులు ఆంక్షలు విధించడంపై యువకులు ఘర్షణకు దిగారు. పోలీసులు వారిని చెదరగొట్టారు. అయినా యువకులు వెనక్కు తగ్గకుండా జాతరలో సెల్ ఫోన్ లైట్ల వెలుగులోనే డ్యాన్స్ లు చేశారు. బాణాసంచా కాల్చారు. జాతర సందర్భంలో పోలీసులు విధించిన ఆంక్షలపై టీడీపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు, టీడీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. ఈ గొడవ జరుగుతున్న సందర్బంలో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు కల్పించుకుని పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
వైసీపీ జాబ్ మేళాను ఉద్దేశించి కూడా
ఇంతకు ముందు కూడా సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి పై అసభ్యంగా దూషించారన్న అభియోగం, ఆ తరువాత మరో కేసు అయ్యన్నపై నమోదు అయిన సంగతి తెలిసిందే. అధికార వైసీపీ నేతలపై అయ్యన్న తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. తాజాగా తిరుపతిలో జరిగిన వైసీపీ జాబ్ మేళాను ఉద్దేశించి కూడా సీఎం వైఎస్, జగన్, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపైనా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.