YCP MLC Candidates: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యుల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపిలో ఖాళీగా ఉన్న 11 ఎమ్మెల్సీ స్థానాలకు వైసీపీ అభ్యర్ధులను ప్రకటించింది. ఇప్పటికే ఎమ్మెల్యే కోటాలో మూడు ఎమ్మెల్సీలకు అభ్యర్ధులను ప్రకటించిన వైసీపీ నేడు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించింది. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్ధుల పేర్లను ప్రకటిస్తూ పదవుల్లో రిజర్వేషన్లు ఇచ్చిన ఘటన సిఎం వైఎస్ జగన్మోహనరెడ్డిదేనన్నారు. మొత్తం 14 ఎమ్మెల్సీల్లో ఏడు ఓసీలకు, ఏడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేటాయించడం జరిగిందన్నారు. ఇప్పుడు సర్దుబాటు చేయలేక పోయిన నాయకులకు తర్వాత అవకాశం ఉంటుందని సజ్జల పేర్కొన్నారు.
YCP MLC Candidates: వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధులు
విజయనగరం జిల్లా నుండి ఇందుకూరి రఘురామ రాజు (క్షత్రియ)
విశాఖ జిల్లా నుండి వంశీకృష్ణ యాదవ్ (బీసీ), వరుదు కళ్యాణి (బీసీ, కప్పుల వెలమ)
తూర్పు గోదావరి జిల్లా నుండి అనంత బాబు (ఓసి, కాపు)
కృష్ణాజిల్లా నుండి తలసిల రఘురాం (ఓసీ, కమ్మ), మొండితోక అరుణ్ కుమార్ (ఎస్సీ, మాదిగ)
గుంటూరు జిల్లా నుండి ఎం హనుమంతరావు (చేనేత, బీసి), ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు (ఒసి, కాపు)
ప్రకాశం జిల్లా నుండి టి మాధవరావు (ఒసి, కమ్మ)
చిత్తూరు జిల్లా నుండి భరత్ (ఎస్సీ)
అనంతపురం జిల్లా నుండి శివరామిరెడ్డి (ఒసి, రెడ్డి)