Breaking: ఏపి రాష్ట్ర వ్యాప్తంగా బంగారు నగల దుకాణాలపై జాయింట్ కంట్రోలర్ ఆధ్వర్యంలో సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విజయవాడ, విశాఖ, తణుకు, తిరుపతి, నెల్లూరు జిల్లాలో మొత్తం 60 బంగారు దుకాణాలపై తనిఖీలు నిర్వహించారు. కొలతల్లో అక్రమాలకు పాల్పడుతూ వినియోగదారులను మోసం చేస్తున్న 31 దుకాణాలపై కేసులు నమోదు చేసినట్లు జాయింట్ కంట్రోలర్ మాధురి తెలిపారు. నగలు కొనుగోలు సమయంలో వినియోగదారులకు బిల్లుల్లో బంగారం నాణ్యతను చూపడం లేదని ఆమె తెలిపారు.
బంగారు దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు జరుగుతుండటంతో పలు ప్రాంతాల్లో బంగారం షాపులను మూసివేశారు. జ్యూయిలరీ షాపుల్లో కనిపించని మోసాలు జరుగుతున్నాయని చాలా కాలంగా ఆరోపణలు వస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ కొరవడంతో బంగారు షాపు యజమానులు వినియోగదారులను మోసాలకు గురి చేస్తున్నారు. సోమవారం జరిగిన దాడులతో బంగారు షాపు యజమానులు ఆందోళనకు గురైయ్యారు.