AP High Court: ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు కొత్తగా నలుగురు న్యాయమూర్తులు నియామకం కానున్నారు. ఏపీ హైకోర్టుకు నలుగురు నూతన న్యాయమూర్తులను సుప్రీం కోర్టు కొలీజియం సిపారసు చేసింది. న్యాయవాదుల కోటాలో సీనియర్ న్యాయవాదులు హరినాథ్ నూనెపల్లి, కిరణ్మయి మండవ (కిరణ్మయి కనపర్తి), నసుమతి జగడం, న్యాపతి విజయ్ లను న్యాయమూర్తులుగా ఎంపికకు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మరో ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులతో సంప్రదించి, ఈ ఏడాది ఫిబ్రవరిలో సిఫార్సు చేశారు. ఈ సిఫార్సును ఏపీ ముఖ్యమంత్రి, గవర్నర్ అమోదించారు. ఇవేళ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం నలుగురి పదోన్నతికి సంబంధించిన ప్రతిపాదనపై ఆమోదం తెలిపింది.
ఇందులో హరినాథ్ నూనెపల్లి, కిరణ్మయి మండవ, సుమతి జగడం పేర్లను కొలీజియంలోని సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించగా, న్యాయపతి విజయ్ విషయంలో ఒక సభ్యుడు తన అభిప్రాయాలను వెల్లడించలేదు. మిగిలిన సభ్యులు ఆయనను హైకోర్టు బెంచ్ కి పదోన్నతి సమర్ధించారు. సుప్రీం కోర్టు కొలీజియం ప్రతిపాదనలను కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు పంపించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 37 మంది న్యాయమూర్తులకు గానూ ప్రస్తుతం 27 మంది న్యాయమూర్తులు సేవలు అందిస్తున్నారు. తాజా న్యాయమూర్తుల నియామకంతో ఆ సంఖ్య 31కి చేరుతుంది.
YSRCP: సీఎం జగన్ ఆలోచన మామూలుగా లేదుగా..! పకడ్బందీ వ్యూహాలతో కార్యక్రమాలు..!!
కొలీజియం స్టేట్ మెంట్ కొరకు లింక్ క్లిక్ చేయండి..