Amaravati Land scam: రాజధాని అమరావతి భూముల విషయంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంపై ఏపి హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ దినేశ్ మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.
రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియన్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వ వాదనలను, ఆలోచనలను పరిగణలోకి తీసుకోకుండా ఏపి హైకోర్టు తీర్పును వెలువరించిందనీ, తాము లేవనెత్తిన ఏ అంశాన్ని హైకోర్టు పరిగణలోకి తీసుకోనందన ఈ పిటిషన్ పై విచారణ చేపట్టాలని దుష్యంత్ దవే సుప్రీం ధర్మాసనం దృష్టికి తెచ్చారు. అయితే ఏపి హైకోర్టు అన్ని అంశాలనూ పరిగణలోకి తీసుకున్న తరువాతే తీర్పు ఇచ్చినట్లు భావిస్తున్నామన్న ద్విసభ్య ధర్మాసనం..ప్రభుత్వ తరపున న్యాయవాది వాదనలను విభేదించింది. అనంతరం కేసు తదుపరి విచారణను సోమవారం (19వ తేదీ)కి వాయిదా వేసింది.