Supreme Court: పోలవరం ప్రాజెక్టు పై కేంద్రానికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి పూర్తి ఖర్చు భరించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ రాజ్యసభ ఎంపీ కేవిపీ రామచంద్రరావు గతంలో ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అయితే కేవిపీ పిటిషన్ పై విచారణను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ 2019లో కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ సుప్రీం కోర్టు సీజేఐ జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఇవేళ విచారణ జరిపింది. పిటిషన్ ను ఏపీ హైకోర్టు నుండి బదిలీ చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనుల వినిపించారు.
దీనికి సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన కేసులోఏపీ హైకోర్టుకే వెళ్లాలని కేంద్రానికి సుప్రీం కోర్టు సూచించింది. ఏపీ హైకోర్టులోనే కేంద్రం తన వాదనలను వినిపించుకోవాలని పేర్కొంటూ.. కేంద్ర ప్రభుత్వ పిటిషన్ ను డిస్మిస్ చేసింది.
YS Jagan: జూనియర్ న్యాయవాదులకు సీఎం జగన్ చిన్న రిక్వెస్ట్ .. ఆ ఒక్క పని చేయండి చాలు అంటూ..