టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇవేళ రాత్రి యర్రగొండపాలెంలో చంద్రబాబు రోడ్ షో, బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో మంత్రి ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు నల్లచొక్కాలు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు వచ్చే మార్గంలో నల్ల జెండాలు, ప్లకార్డులు, నల్లబెలూన్లతో రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. ఎస్సీలకు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. దళిత ద్రోహి అయిన చంద్రబాబుకు యర్రగొండపాలెంలో అడుగుపెట్టే అర్హత లేదని మంత్రి సురేష్ అన్నారు. దళితులకు క్షమాపణ చెప్పిన తర్వాతనే పర్యటించాలన్నారు.
ప్రకాశం జిల్లాకు చంద్రబాబు చేసింది ఏమీలేదని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకాశం జిల్లాను అభివృద్ధి చేశారన్నారు. వెలిగొండ ప్రాజెక్టును తమ ప్రభుత్వమే పూర్తి చేసిందని అన్నారు. శాంతి యుతంగా చంద్రబాబు కు నిరసన తెలుపుతున్నామని అన్నారు. మంత్రి తన చొక్కా విప్పి నిరసన వ్యక్తం చేశారు. కొద్దిసేపటి తర్వాత మంత్రి సురేష్ ను ఆయన క్యాంపు కార్యాలయానికి పోలీసులు పంపారు. వైసీపీ కార్యకర్తల నిరసనతో ఎన్ఎస్జీ అప్రమత్తమైంది. చంద్రబాబు భద్రత కోసం అదనపు సిబ్బందిని రప్పించారు. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుని ఇరువర్గాలను నిలువరించారు.
IIT – Madras: ఐఐటీ మద్రాస్ లో మరో విద్యార్ధి ఆత్మహత్య .. ఈ ఏడాదిలో నాల్గవ ఘటన..