TTD: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి గత నెల 11వ తేదీన రెండవ సారి ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. వైవీ బాధ్యతలు చేపట్టి నెల రోజులు దాటి పోయింది. ఈ నెల రోజుల వ్యవధిలో బోర్టు సభ్యుల ఎంపికపై కసరత్తు పూర్తి అయ్యింది. వివిధ రాష్ట్రాల నుండి సభ్యుల నియామకానికి సంబంధించి సిఫార్సు లేఖలు రావడం ఆలస్యం కావడం వల్ల సభ్యుల నియామకంలో జాప్యం జరిగిందని భావిస్తున్నారు. టీటీడీ పాలకమండలిపై అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై కసరత్తు పూర్తి చేసి బోర్డు సభ్యుల పేర్లు ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వం నుండి ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది.
25 మంది రెగ్యులర్ సభ్యులలో తెలంగాణ నుండి అయిదుగురు, కర్నాటక నుండి ఇద్దరు, తమిళనాడు నుండి ఇద్దరికి స్థానం లభించినట్లు తెలుస్తోంది. అదే విధంగా ప్రత్యేక ఆహ్వానితులుగా వివిధ రాష్ట్రాల నుండి సేవా భావం కల్గిన 50 మంది వ్యక్తులను నియమించినట్లు సమాచారం. ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డితో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తాజాగా భేటీ కావడంతో బోర్డు సభ్యుల నియామకానికి సంబంధించి చర్చించారని వార్తలు వచ్చాయి. దాదాపు పాలకమండలి జాబితా ఖరారు అయ్యినట్లు సమాచారం అందుతోంది. రెండు రోజుల్లో సభ్యుల నియామకం పూర్తి చేసి ఉత్తర్వులు ఇవ్వవచ్చని భావిస్తున్నారు.
కాగా ప్రత్యేక ఆహ్వానితులకు విధాన నిర్ణయాల్లో ఎలాంటి పాత్ర ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. మొత్తం 75 మందితో టీటీడీ పాలకమండలి ఉండనుంది. ఇక ఎక్స్ అఫిషియో సభ్యులుగా వైసీపీ ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరడ్డి కొనసాగనుండగా, బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ గా నియమితులైన సుధాకర్ నియమితులైనట్లు తెలుస్తోంది.
Read More:
1.Perni Nani: ఆన్లైన్ సినిమా టికెట్లపై మేధోబలుల దుష్ప్రచారం అంటూ మంత్రి పేర్ని సెటైర్లు..
2.KTR Vs Bandi Sanjay: మంత్రి కేటిఆర్ రాజీనామా..? బండికి కేటిఆర్ సవాల్..!!