NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Capital: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై కేంద్రం ఇచ్చిన తాజా క్లారిటీ ఇదీ..!!

AP Capital: ఏపి మూడు రాజధానుల అంశం హైకోర్టులో విచారణలో ఉన్న సంగతి తెలిసిందే. గతంలో ఏపి రాజధాని అమరావతిగా కేంద్ర హోంశాఖ మ్యాప్ లో పేర్కొన్నది. కేంద్ర ప్రభుత్వం లేఖలు అమరావతి అడ్రస్ తోనే కొంత కాలం వచ్చాయి. అయితే ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వంలోని పలు శాఖల నుండి వచ్చే లేఖలు హైదరాబాద్ అడ్రస్ తో వస్తుండటం మరో వివాదానికి కారణం అయ్యింది. గత టీడీపీ ప్రభుత్వం అమరావతిని ఏపి రాజధానిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చింది. అమరావతిని శాసన రాజధానిగా, విశాఖను పరిపాలనా రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా జగన్ సర్కార్ ప్రకటించింది. ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేయడం, గవర్నర్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడం కూడా అయిపోయింది.

Union Home ministry not clarifies on AP Capital
Union Home ministry not clarifies on AP Capital

Read More: Katti Mahesh: కత్తి మహేష్ మరణంపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎంఆర్‌పీఎస్ నేత మంద కృష్ణమాదిగ

అయితే మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతాంగం హైకోర్టులో పిటిషన్ లు దాఖలు చేయడంతో రాజధాని తరలింపు అంశంపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు (స్టే) ఇచ్చింది. రాజధానుల అంశంపై విచారణ కొనసాగుతోంది.  ఈ నేపథ్యంలో అసలు ఏపి రాజధానిగా కేంద్రం ఏ ప్రాంతాన్ని గుర్తిస్తుందనే అంశంపై వివాదం నడుస్తోంది. అమరావతిని కేంద్రం ఏపి రాజధానిగా గుర్తించలేదనే వాదన మొదలైంది. ఈ నేపథ్యంలో సమాచార హక్కు చట్టం ద్వారా ఆర్ టీ ఐ కార్యకర్త చైతన్యకుమార్ రెడ్డి ఇటీవల కేంద్రాన్ని ప్రశ్నించగా ఏపికి మూడు రాజధానులు అంటూ సమాధానం ఇచ్చింది. అయితే కేంద్రం ఇచ్చిన సమాధానంపై అమరావతి జేఏసీ అధ్యక్షుడు జీవిఆర్ శాస్త్రి హోంశాఖకు ఫిర్యాదు చేయడంతో కేంద్రం మాట మార్చింది. ఆర్‌టీఐ కార్యకర్తకు మరో సమాధానం ఇచ్చింది. ఏపి రాజధాని అంశం కోర్టు పరిధిలో ఉందంటూ మరో లేఖను కేంద్ర హోంశాఖ పంపింది.

మరో పక్క అమరావతి ప్రాంతంలో రాజధానికి భూములు ఇచ్చిన రైతాంగం ఇక్కడే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా త్వరలో విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటు అవుతుందనీ, దీన్ని ఎవరూ అడ్డుకోలేరంటూ   మున్సిపల్ శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి చెబుతూ వస్తున్నారు. ఏది ఎలా ఉన్నా అమరావతిని రాజధానిగా వైసీపీ ప్రభుత్వం అంగీకరించని కారణంగా హైకోర్టు తుది తీర్పు వచ్చే వరకూ రాజధాని లేని రాష్ట్రంగా ఏపి కొనసాగనున్నది. రాజధాని వ్యవహారం ఇప్పట్లో తేలదని, ఒక వేళ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తే అమరావతి ప్రాంత రైతులు సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. రైతులకు అనుకూలంగా తీర్పు వస్తే ఏపి ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసే అవకాశం ఉంది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N