YS Jagan – Kesineni Nani: విజయవాడ ఎంపీ కేశినేని నాని ఈరోజు సీఎం వైఎస్ జగన్ తో సమావేశమైయ్యారు. ఇటీవలే ఎంపీ పదవికి, టీడీపీకి రాజీనామా చేస్తానని కేశినేని నాని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన కుమార్తె కేశినేని శ్వేత కూడా విజయవాడ కార్పోరేషన్ 11 వ డివిజన్ కార్పోరేటర్ పదవికి రాజీనామా చేశారు. టీడీపీకి రాజీనామా చేస్తానని కేశినేని ప్రకటించిన రోజునే ఏదో ఒక పార్టీ తరపున గానీ స్వతంత్ర అభ్యర్ధిగానైనా విజయవాడ నుండి మూడో సారి పోటీ చేస్తానని చెప్పారు.
ఈ తరుణంలోనే వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ అయోధ్యరామిరెడ్డి, పలువురు వైసీపీ కీలక నేతలు కేశినేని నానితో చర్చలు జరిపారు. వైసీపీలో చేరితే తగిన విధంగా ప్రాధాన్యత ఇస్తామని వారు హామీ ఇవ్వడంతో పాటు ఇవేళ సీఎం వద్దకు తీసుకువెళ్లారు. బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వెళ్లిన నాని.. సీఎం జగన్ తో గంటకుపైగా సమావేశమైయ్యారు. కేశినేని నానితో పాటు ఈ కార్యక్రమంలో వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ అయోధ్య రామిరెడ్డి, నందిగామకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్ లు ఉన్నారు.
తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేశినేని నాని జగన్ తో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేయడానికి నాని సుముఖత వ్యక్తం చేసినట్లుగా తెలుస్తొంది. అయితే పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో రెండు మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు తాను సూచించిన అభ్యర్ధులకు టికెట్ ఇవ్వాలని నాని ప్రతిపాదన పెట్టినట్లుగా తెలుస్తొంది. ఎంపీ కేశినేని నాని ప్రతిపాదనలపై సీఎం వైఎస్ జగన్ ఏ విధంగా స్పందిస్తారు అనేది వేచి చూడాలి. ఎంపీ పదవికి రాజీనామా చేసిన తర్వాత కేశినేని నాని అధికారికంగా వైసీపీ లో చేరనున్నారు.
AP High Court: ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు బిగ్ రిలీఫ్ .. మూడు కేసుల్లో ముందస్తు బెయిల్