Suicide: గుంటూరు వ్యవసాయ శాఖలోని ఒక మహిళా ఉద్యోగిని నేడు ఆత్మహత్య చేసుకున్నారు. గుంటూరు నగరంలోని భూసార పరీక్షా కేంద్రంలో పని చేస్తున్న ఉమాదేవి అనే ఉద్యోగిని ఒంటిపై యాసిడ్ పోసుకుని ఆత్మహత్యాయత్నంకు పాల్పడింది. ఆమెను హుటాహుటిన జీజీహెచ్ కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. నగర పాలెం పోలీసుల వేధింపులు తాళ లేక ఆమె ఆత్మహత్యాయత్నంకు పాల్పడినట్లు చెబుతున్నారు.
విషయం ఏమిటంటే.. ఉమాదేవి కుమారుడు బాజీ కిరణ్ ఇటీవల కరోనాతో మృతి చెందాడు. అనంతరం ఉమాదేవి ఆమె కోడలుకు మధ్య ఆస్తి వివాదాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఉమాదేవి కోడలు గుంటూరులోని నగరపాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై పోలీసులు ఉమాదేవిని విచారణ చేశారు. ఆ కేసుకు భయపడే ఆమె ఆత్మహత్య చేసుకుందని భావిస్తున్నారు. తన కోడలికి వత్తాసుగా పోలీసులు మాట్లాడుతున్నారని ఉమాదేవి బంధువుల వద్ద చెప్పినట్లు తెలుస్తోంది.