ఏపీలో రాబోయే ఎన్నికలపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. ఓ వైపు టీడీపీ – జనసేన పొత్తుతో ముందుకు వెళతాయి అంటూ ప్రచారం జరుగుతోంది. మరో పక్క వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తాననే విషయాన్ని చెప్పడం లేదు కానీ అధికారం జనసేనదే, వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపడం ఖాయమని అంటున్నారు. టీడీపీ బలమైన స్థానాల్లోనూ పవన్ కళ్యాణ్ జనసేన ఇన్ చార్జ్ లను నియమిస్తున్నారు. దీంతో ఆ నియోజకవర్గాల్లో టీడీపీ అయోమయానికి గురి కావాల్సి వస్తొంది.
మరో పక్క బీజేపీ తాము జనసేనతోనే పొత్తు అని చెబుతోంది. పొత్తులపై రాష్ట్రంలోని ఆయా పార్టీల్లో ప్రస్తుతం అయోమయ పరిస్థితి కొనసాగుతోంది. ఈ తరుణంలో రాబోయే ఎన్నికలపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. 2024 ఎన్నికల్లో రెండవ స్థానానికి అత్యంత గట్టి పోటీ జరుగుతుందన్నారు. టీడీపీ ఓట్లు జనసేనకు, జనసేన ఓట్లు బీజేపీకి బదిలీ అయ్యే అవకాశం ఉన్నట్లుగా కనబడుతోందన్నారు. ఏది ఏమైనా 51 శాతం ఓట్ల షేర్ తో వైసీపీ మరో సారి అధికారంలోకి రావడం ఖయంగా కనబడుతోంది కాబట్టి ఏపీలో ప్రతిపక్షాలు 2024 ఎన్నికలను వదిలివేసి 2029కి సన్నద్దం కావాలేమో అన్న అభిప్రాయాన్నివ్యక్తం చేశారు.
సో.రెండో స్థానానికి గట్టి పోటీ ఉంటుంది అంటున్నారంటే .. టీడీపీ – జనసేన పొత్తు ఉండదు, జనసేన – బీజేపీ, టీడీపీ వేరువేరుగా పోటీ చేస్తాయనేది పరోక్షంగా వెల్లడించినట్లు అవుతోంది.
ఏపీ రాజకీయ నేతలకు, ప్రజలకు రేణు దేశాయ్ కీలక వినతి.. సెల్ఫీ వీడియో విడుదల..మంత్రి అంబటి స్పందన ఇలా..