Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ 12వ వారం గేమ్ కొనసాగుతోంది. హౌస్ లో 9 మంది ఉన్నారు. ఈ వారం నామినేషన్ లో ఏడుగురు ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది సస్పెన్స్ గా మారింది. మరోపక్క ఈ వారం డబల్ ఎలిమినేషన్ ఉండే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం హౌస్ లో కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులు ఎంట్రీ ఇస్తున్నారు. జరుగుతున్న ఈ ఫ్యామిలీ ఎపిసోడ్ లో.. చాలాకాలం తర్వాత తమ కుటుంబ సభ్యులను చూసుకొని హౌస్ మేట్స్ ఎమోషనల్ అవుతున్నారు. ఆల్రెడీ మంగళవారం ఎపిసోడ్ లో ఆదిరెడ్డి భార్య కూతురు రావడం జరిగింది. ఆదిరెడ్డి కూతురు ఫస్ట్ బర్త్ డే వేడుకలు కూడా జరిగాయి. ఆ తర్వాత రాజు వాళ్ళ అమ్మగారు వచ్చారు.
ఇక బుధవారం ఎపిసోడ్ లో ఫైమా.. వాళ్ళ అమ్మతో పాటు శ్రీసత్య వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు. ఈ క్రమంలో కీర్తి చాలా ఎమోషనల్ అయింది. ఫైమా.. వాళ్ళ అమ్మ వచ్చిన సమయంలో కంటనీరు పెట్టుకుంది. దీంతో కీర్తి ఏడవటాన్ని కొంతమంది తప్పు పడుతూ… సింపతి కోసమంటూ ట్రోల్ స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో కీర్తిపై ట్రోలింగ్ విషయంలో బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ మానస్ సీరియస్ అయ్యాడు. హౌస్ లో ఇంటి సభ్యులందరికీ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి వెళ్తున్నారు. అందరూ హ్యాపీగా ఉన్నారు. కానీ కీర్తినీ చూస్తే చాలా బాధగా ఉంది.
ఈ క్రమంలో జనాల్ని చూస్తే విరక్తి వస్తుంది. ముఖ్యంగా పీఆర్ లు ఎవరైతే ఉన్నారో.. వాళ్లు మనుషులేనా అనిపిస్తుంది. సింపతి అని ట్రోల్ చేస్తున్నారు. అరే మీ ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే.. నవ్వుతూ ఉంటారా..? సిగ్గు తెచ్చుకోండి రా, అందరికీ ఫీలింగ్స్ ఉంటాయి. బిగ్ బాస్ ఒక గేమ్, అంతేగాని ఎమోషనల్ తో ఎవరు గేమ్ ఆడరు అంటూ.. కీర్తి పై ట్రోలింగ్ చేస్తున్న వారిపై మానస్ సోషల్ మీడియాలో మండిపడ్డాడు. గతంలో కీర్తికి ఆడియో మెసేజ్ పెట్టి బాగా ఆడుతున్నావని.. మానస్ సపోర్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మరోసారి కీర్తి విషయంలో మానస్.. సీరియస్ కావడం సంచలనం సృష్టించింది.