మొదటి నుండి తెలుగుదేశం పార్టీలో యువకులు హావా తక్కువే. అదీకాక ఇప్పుడు చంద్రబాబు నిలకడలేమి… లోకేష్ పై నమ్మకం లేకపోవడంతో యువత ఎక్కువగా ఇతర పార్టీల వైపు చూస్తున్నారు.. పార్టీలోని యువకుల్లో చాలా మంది సీనియర్ నేత వారసులు. వారిని పార్టీ లీడర్లలా కాకుండా తండ్రి చాటు బిడ్డగా చూస్తుండడంతో ఈ పార్టీకి కి తమ ఆలోచనలను, శ్రమ ను ధారబోసే ఉద్దేశంలో ఎవరూ కనిపించడం లేదు.
వారే ఆఖరు..!
తెలుగుదేశం పార్టీ యువతకు సారధ్యం వహించిన అనేక మంది నేతలు తర్వాత కాలంలో ఉన్నత పదవులు పొందారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు, నందమూరి హరికృష్ణ, అమర్నాథ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, బీదా రవిచంద్ర యాదవ్ లాంటి నేతలు తెలుగు యువతకు గతంలో సారథ్యం వహించారు. కానీ ఇప్పుడు ఆ పదవులు చేపట్టేందుకు మాత్రం ఎవరూ ముందుకు రావడం లేదు.
సమాధానం సైతం ఇవ్వట్లేదు..!
తెలుగు యువత అధ్యక్షుడిగా ఉన్న దేవినేని అవినాష్ ఆ పదవికి రాజీనామా చేశారు. ఇప్పటి వరకు అందులో ఎవరినీ తెలుగుదేశం అధినేత నియమించింది లేదు. కాదు…. కాదు ఎవరు ముందుకు రావడం లేదు. బాబు ఆలోచన అయితే…. కమ్మ సామాజిక వర్గం వారికి కాకుండా ఇతరులకు ఈ పదవిని ఇచ్చి మరింత యువతను పార్టీలోకి చేర్చి కొంతవరకు పార్టీని బలపరచాలని. అయితే ఇందులో అనేక పేర్లు పరిశీలనలో ఉండగా…. వారిని టీడీపీ అధిష్టానం సంప్రదించగా వారి వద్ద నుండి కూడా పెద్దగా రెస్పాన్స్ లేదు.
వారికి వద్దట…. వీరికి ఈయన ఇవ్వరట..!
గంటి హరీష్ మాధుర్, చింతకాయల విజయ్, పరిటాల శ్రీరామ్ వంటి వారు ఈ పదవికి మొగ్గు చూపుతారని బాబు ఆశించారు. అయితే తెలుగు యువత రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టేందుకు ఎవరు ముందుకు రాలేదు. చివరికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొడుకు రాజగోపాల్ రెడ్డి పేరునిచంద్రబాబు పరిశీలిస్తున్నారు. మరోవైపు నాదెళ్ల బ్రహ్మం చౌదరి కూడా ఇదే పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. ఇతను లోకేష్ కు సన్నిహితుడు అయినా కూడా అతని పట్ల ఆసక్తి చూపడం లేదని సమాచారం.
ఏ ఇతర పార్టీలో అయినా ఇటువంటి పదవి కోసం కొట్టుకుంటారు కానీ ఇప్పుడు టిడిపిలో మాత్రం వచ్చి పదవి చేపట్టండి నాయనా ….అంటే మాకొద్దు బాబోయ్ అని పరిగెడుతున్న తీరు ఆ పార్టీ దుస్థితిని తెలియజేస్తుంది