బాలకృష్ణ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇబ్బందుల విషయంలో ఫిలిం ఛాంబర్ షూటింగ్ లు మొత్తం ఆపేయడం తెలిసిందే. దాదాపు వారం రోజులకు పైగానే సినిమా ఇండస్ట్రీలో అన్ని షూటింగులు బంద్ అయ్యాయి. దీంతో నిర్మాతలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటువంటి దారుణంలో బాలయ్య బాబు తన కొత్త సినిమా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో “NBK 107” వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న “మైత్రి మూవీ మేకర్స్” నిర్మాతలకు బాలయ్య బాబు తాజాగా డెడ్ లైన్ పెట్టడం జరిగిందంట. షూటింగ్ బంద్ నేపథ్యంలో తన సినిమా షూటింగ్ ఆగిపోవడంతో బాలయ్య ఆగ్రహంగా ఉన్నారట. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ తనకి కోవిడ్ రావడం వల్ల కొన్ని వారాలపాటు ఆగిపోవడం జరిగింది.
అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో షూటింగ్ బంద్ నేపథ్యంలో ఆగిపోవడంతో మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉండటంతో బాలయ్య బాబు ఎట్టి పరిస్థితుల్లో మల్లీ షూటింగ్ స్టార్ట్ చేయాలని నిర్మాతలకు డెడ్ లైన్ పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో టర్కీ షెడ్యూల్ పూర్తి చేయాలని బాలకృష్ణ నిర్మాతలకు తెలియజేసినట్లు సమాచారం. దీంతో ఆగస్టు మూడో వారంలో సినిమా యూనిట్ మొత్తం టర్కీ వెళ్లడానికి రెడీ అవుతున్నట్లు ఈ లోపు షూటింగ్ లు స్టార్ట్ అయితే బాగుంటుందని ‘NBK 107″ నిర్మాతలు అనుకుంటున్నారట. వాస్తవానికి ఈ సినిమా దసరా పండుగకు విడుదల చేయాలని నిర్మాతలు స్టార్టింగ్ లో ప్లాన్ చేసినట్లు ఇండస్ట్రీలో టాక్.
కానీ సినిమా యూనిట్ కరోనా బారిన పడటం కొన్ని వారాలు షూటింగ్ ఆగిపోవడంతో డిసెంబర్ కి పోస్ట్ పోన్ అయింది. తాజా పరిస్థితుల క్రమంలో మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉండటంతో అట్టి పరిస్థితుల్లో షూటింగ్ స్టార్ట్ చేయాలని బాలయ్య నిర్మాతలకు హుకుం జారీ చేశారట. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇటీవల కర్నూలులో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. వరుస విజయాల మీద ఉన్న గోపీచంద్ మల్లినేని ఈ సినిమా తెరకెక్కించడంతో భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు.