సూపర్స్టార్ మహేశ్కి భారత ప్రభుత్వం హై రేంజ్ బుల్లెట్ ప్రూఫ్ సెక్యూరిటీని ఇచ్చింది. అదేంటి? మహేశ్కి భారత ప్రభుత్వం సెక్యూరిటీ ఇవ్వాల్సిన పనేంటి? అనే సందేహం రాకమానదు. అసలు విషయమేమంటే.. ప్రస్తుతం మహేశ్ తన 26వ చిత్రం `సరిలేరు నీకెవ్వరు` సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. అయితే ఈ సినిమా తొలి షెడ్యూల్ను చిత్ర యూనిట్ కాశ్మీర్లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉండే పాలేగావ్లో కొన్ని సీన్స్ చిత్రీకరించాల్సి వచ్చింది. చిత్ర యూనిట్ ముందుగా పర్మిషన్ తీసుకున్నా.. ఉదయం 5 గంటల నుండి 10 గంటల వరకే షూటింగ్ చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. ఆ సమయంలో కూడా బుల్లెట్ ప్రూఫ్ కారుతో పాటు హై సెక్యూరిటీ ఇవ్వడంతో మహేశ్ పాలేగావ్లోకి అడుగు పెట్టగలిగాడట. అదీ మహేశ్ హై సెక్యూరిటీ వెనుక అసలు సీక్రెట్.
previous post