Pushpa 2: టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ సుకుమార్ స్టార్ దర్శకుడు అని అందరికీ తెలుసు. లాజికల్ గా సినిమాలు చేయడంలో.. డిఫరెంట్ హీరోయిజం చూపించడంలో.. మనోడు స్టైలే వేరు. ప్రేక్షకులు ఊహించని రీతిలో కొత్త కొత్త ఐడియాలతో సుకుమార్ సినిమాలు చేస్తూ ఉంటాడు. ఫస్ట్ సినిమా “ఆర్య” మొదలుకొని మొన్న ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేసి పడేసిన “పుష్ప” వరకు అన్నీ కూడా డిఫరెంట్ జోనర్ కి చెందిన స్టోరీలే. “పుష్ప”తో ఇప్పుడు దేశ వ్యాప్తంగా తనకంటూ సెపరేట్ గుర్తింపు సుకుమార్ దక్కించుకున్నాడు. ఫస్ట్ టైం పాన్ ఇండియా నేపథ్యంలో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన “పుష్ప” దేశంలోనే కాదు ప్రపంచ స్థాయిలో ఒక ఊపు ఊపిన సంగతి తెలిసిందే.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
సినిమాలో అల్లు అర్జున్ మేనరిజం.. వేసిన స్టెప్పులు.. పలికిన డైలాగులు సామాన్యుడు మొదలుకొని సెలబ్రిటీలు సైతం బాగా ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా తగ్గేదేలే… శ్రీవల్లి సాంగ్ స్టెప్ లు.. ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. దీంతో “పుష్ప” విడుదలైన ప్రతి చోట అనేక రికార్డులు క్రియేట్ చేయడం తెలిసిందే. ఈ పరిణామంతో ఇప్పుడు “పుష్ప” రెండో భాగం కోసం జనాలు అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సెకండ్ పార్ట్ “పుష్ప” సూపర్ డూపర్ హిట్ అవ్వాలని సుకుమార్ సెంటిమెంట్ రిపీట్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్ నడుస్తోంది. మేటర్ లోకి వెళ్తే సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం, పుష్ప మొదటి భాగం రెండు బ్లాక్ బస్టర్ కావటం తెలిసిందే. అయితే ఈ రెండు సినిమాల షూటింగులు తూర్పుగోదావరి జిల్లా పరిసర ప్రాంతాలలో జరిగాయి.
అయితే ఇప్పుడు పుష్ప సెకండ్ పార్ట్ షూటింగ్ దాదాపు తూర్పుగోదావరి జిల్లా మారేడు మల్లి అడవుల్లో జరిపించే ఆలోచనలో సుకు ఉన్నట్లు సమాచారం. ఈ రీతిగా షూటింగ్ చేయటం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి కూడా సినిమాకి రాయితీ వచ్చే అవకాశం ఉండటంతో.. దాదాపు ఎక్కువ షూటింగ్ ఏపీలో మారేడుమల్లి అడవులలో… చేయటానికి పూనుకుంటున్నట్లుగా టాక్ నడుస్తోంది. దీంతో పుష్ప, రంగస్థలం సినిమా మాదిరిగా పుష్ప రెండో భాగం కూడా బ్లాక్ బస్టర్ విజయం సాధిస్తుందని సుకుమార్ ఆలోచన చేసినట్లు వార్తలు వస్తున్నాయి.