Bigg Boss Ott: బుల్లితెరపై సక్సెస్ ఫుల్ షోగా గుర్తింపు పొందించిన రియాలిటీ గేమ్ షో బిగ్బాస్.. ప్రస్తుతం ఓటీటీ వేదికగా సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముక ఓటీటీ డిస్నీ ప్లాస్ హాట్స్టార్లో ఈ షోన్ 24/7 అలరిస్తోంది. `బిగ్బాస్ నాన్స్టాప్` పేరుతో ప్రసారం అవుతున్న ఈ షోకి సైతం నాగార్జుననే హోస్ట్గా వ్యవహరిస్తున్నారు.
మొత్తం 17 మంది కంటెస్టెంట్స్ ఓటీటీ బిగ్బాస్లోకి అడుగు పెట్టగా.. మొదటి వారం ముమైత్ ఖాన్ బయటకు వెళ్లిపోయింది. రెండో వారం శ్రీ రాపాక, మూడో వారం ఆర్జే చైతూ ఇంటి బాట పట్టారు. అయితే నాలుగో వారం కూడా పూర్తి కాబోతుండగా.. ఈ సారి ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది ఆసక్తికరంగా మారింది.
ఈ వారం నామినేషన్స్లో అజయ్, అరియానా, అనీల్ రాథోడ్, బిందుమాధవి, యాంకర్ శివ, సరయు, మిత్రా శర్మలు ఉన్నారు. వీరిలో మిత్రా శర్మ తీరు ఫస్ట్ వీక్ నుంచి ప్రేక్షకులకు నచ్చడం లేదు. దీంతో ఈసారి మిత్రా శర్మనే బ్యాగ్ సద్దేయబోతోందని సోషల్ మీడియాలో బలంగా ప్రచారం జరిగింది.
కానీ, బిగ్బాస్ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. మిత్రా శర్మను కాకుండా.. సరయును రేపు ఎలిమినేట్ అయింది తాజా సమాచారం ద్వారా తెలుస్తోంది. కాగా, ఐదో సీజన్లో ఇలా వచ్చి అలా వెళ్లిన సరయు.. ఈ సారి మాత్రం బాగా పర్ఫామ్ చేస్తోంది. మిత్రాతో పోలిస్తే సరయు గేమ్ చాలా బాగుతుందని చెప్పాలి. అయినప్పటికీ మిత్రాను సేవ్ చేసి సరయును బయటకు పంపిస్తే నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేయడం ఖాయం.