Chiranjeevi: టాలీవుడ్ ఇండస్ట్రీలో కుర్ర హీరోల అందరి కంటే మంచి స్పీడ్ మీద ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఒకపక్క ఇండస్ట్రీ సమస్యలు తీరుస్తూనే మరోపక్క వరుసపెట్టి సినిమాలను లైన్ లో పెడుతున్నారు. సైరా సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” సినిమా స్టార్ట్ చేయగా… మహమ్మారి కరోనా రావటంతో .. దాదాపు రెండు సంవత్సరాలపాటు సినిమా షూటింగ్… ఆగుతూ సాగుతూ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఎట్టకేలకు ఇటీవల షూటింగ్ కంప్లీట్ కావడంతో చిరంజీవి నెక్స్ట్ సినిమాలను ప్రకటించేశారు.
బాబీ దర్శకత్వంలో ఆ తర్వాత తమిళ్ దర్శకత్వంలో ఒక సినిమా తో పాటు డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో బోలా శంకర్ సినిమా చేస్తున్నట్లు టైటిల్ ప్రకటించడం తెలిసిందే. ఇదిలా ఉంటే మార్చి ఫస్ట్ మహాశివరాత్రి సందర్భంగా.. బోలా శంకర్ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ ఉదయం 9 గంటల 5 నిమిషాలకు… రిలీజ్ చేస్తున్నట్లు సినిమా ఏమిటి అధికారికంగా ప్రకటించింది.
సినిమాలో లో లో స్టార్ చిరంజీవి చెల్లెలు గా కీర్తి సురేష్ నటిస్తోంది. తమిళ సినిమా వేదాళం కి రీమేక్గా తెరకెక్కుతోంది. చిరంజీవి సరసన హీరోయిన్ గా తమన్నా నటిస్తోంది. ఇదిలా ఉంటే “గాడ్ ఫాదర్” సినిమా షూటింగ్ ఒకపక్క చేస్తూ ఉండగానే మరోపక్క “బోలా శంకర్” సినిమా కూడా కంప్లీట్ చేసి తరహాలో చిరంజీవి ప్లానింగ్ చేస్తున్నట్లు టాక్. ఆచార్య ఏప్రిల్ మాసం లో రిలీజ్ కానున్న తరుణంలో.. ఈ ఏడాది కనీసం “ఆచార్య” తో పాటు చేస్తున్న “బోలా శంకర్”, “గాడ్ ఫాదర్”.. ఈ సంవత్సరంలోనే విడుదలయ్యేలా… మహమ్మారి తీసుకొచ్చిన గ్యాప్ ఫీల్ చేయాలని.. డిసైడ్ అయినట్లు ఇండస్ట్రీ టాక్.