అర్జున్ రెడ్డి భామగా కుర్రకారును ఆకట్టుకున్న షాలినీ పాండే బంపర్ ఆఫర్ పట్టేసింది. బాలీవుడ్లో తొలిసినిమాకు సైన్ చేసింది. వరుస సక్సెస్లతో హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న రణ్వీర్ సరసన నటించే అవకాశాన్ని షాలినీ దక్కించుకుంది. యశ్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తున్న ‘జయేశ్ భాయ్ జోర్దార్’ అనే సినిమాలో నటించనుంది. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలైంది. ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ తన బాలీవుడ్ అవకాశం గురించి చెప్పింది. తనకు ఇది గుడ్ న్యూస్ అని.. రణ్వీర్తో నటించడం తన అదృష్టమని తెలిపింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని.. స్ఫూర్తిదాయకమని పేర్కొంది.
షాలినీ తెలుగులో ‘అర్జున్ రెడ్డి’, ‘మహానటి’, ‘118’, ‘ఎన్.టి.ఆర్ కథానాయకుడు’ తదితర సినిమాల్లో నటించింది. ప్రస్తుతం అనుష్క ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘నిశ్శబ్దం’ సినిమాలోనూ, రాజ్ తరుణ్ ‘ఇద్దరి లోకం ఒక్కటే’ సినిమాల్లో నటిస్తోంది.