దక్షిణాది సినిమా రంగంలో స్టార్ హీరోయిన్ గా ఒక ఊపు ఊపిన కాజల్ అగర్వాల్ కి బీభత్సమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు దక్షిణాదిలో ఉన్న చాలా మంది టాప్ హీరోలు అందరి సరసన నటించడం జరిగింది. అటువంటి కాజల్ అగర్వాల్ 2020 సంవత్సరం అక్టోబర్ మాసంలో పెళ్లి చేసుకోవటం జరిగింది. పెళ్లి అనంతరం దాదాపు కాజల్ సినిమా ఇండస్ట్రీలో అనేక అవకాశాలు కోల్పోవడం జరిగింది. చిరంజీవి మరియు చరణ్ నటించిన “ఆచార్య” ఇంకా కమల్ హాసన్ నటించిన “ఇండియన్ 2” ప్రాజెక్టు మిస్ చేసుకోవడం జరిగింది.
అయితే ప్రస్తుతం ఓ బిడ్డకు జన్మనిచ్చిన కాజల్ అగర్వాల్ ఇంటికి పరిమితమైన గాని కొన్ని కోట్లు సంపాదిస్తున్నట్లు సమాచారం. అయితే సినిమాల పరంగా పెద్దగా అవకాశాలు రాకపోయినా గాని కాజల్ అగర్వాల్ తన క్రేజ్ ను సోషల్ మీడియా వేదికగా బాగా ఉపయోగించుకుంటూ ఉంది. మేటర్ లోకి వెళ్తే ఇంటిలోనే ఉంటూ కమర్షియల్ యాడ్స్ చేస్తూ ఉందట. మొన్ననే పిల్లలకు సంబంధించిన డైపర్ ఆ తర్వాత పిల్లలు కన్నాక ఆడవాళ్ళ శరీరంలో మార్పులు రాకుండా ఉండటానికి వాడే ఆయిల్ కి సంబంధించి యాడ్ చేస్తూ ప్రముఖ కంపెనీలకు కాజల్ అగర్వాల్ ఆకాశం కల్పిస్తుందట.
మరోపక్క సినిమాలోకి రియంట్రీ ఇవ్వడానికి కూడా కాజల్ అగర్వాల్ ట్రై చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో తనని అత్యంత ఆదరించిన టాలీవుడ్ ఇండస్ట్రీలోనే రీ ఎంట్రీ ఇవ్వటానికి కాజల్ అగర్వాల్ ఇష్టపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం తెలుగు సినిమాల హవా దేశంలో కొనసాగుతుండటంతో…కాజల్ ..పెళ్లి తర్వాత టాలీవుడ్ నుండే రీ ఎంట్రీ ఇచ్చే ఆలోచనలో ఉన్నారట.