Prabhas- Adipurush : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ప్రభాస్ రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి సినిమాలో నటించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు సంపాదించుకున్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా ప్రసిద్ధి చెందాడు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ చేసే ప్రతి ఒక్క సినిమా కూడా ఇదే తరహాలో తెరకెక్కుతోంది. ప్రభాస్ సినిమాలు అంటే కేవలం తెలుగులో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఈ విధంగా ఇండియా మొత్తం ప్రభాస్ కు విపరీతమైన ఫ్యాన్స్ ఉండటంతో బాలీవుడ్ దర్శక నిర్మాతలు కూడా ప్రభాస్ పై దృష్టిసారించారు. ఈ క్రమంలోనే పాన్ ఇండియా తరహాలో కథను సిద్ధం చేస్తున్నారు.
ప్రస్తుతం ప్రభాస్ చేసే ప్రతి ప్రాజెక్ట్ పాన్ ఇండియన్ తరహాలోనే తెరకెక్కుతోంది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఆదిపురుష్”చిత్రాన్ని పాన్ ఇండియా తరహాలో తెరకెక్కిస్తున్నట్లు తెలిసిందే. రామాయణం ఆధారంగా ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టింది. ఈ సినిమా కోసం ప్రభాస్ ఏకంగా ముంబైలో ఓ ఫ్లాట్ కూడా కొన్నారు. రాముడు పాత్రలో ప్రభాస్ కనిపించగా, లక్ష్మణుడి పాత్రలో విక్కీ కౌశల్ నటిస్తున్నట్లు సమాచారం వినబడుతోంది.
సీత పాత్రలో కనిపించనున్న జాతీయ ఉత్తమ నటి:
రామాయణం కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రావణాసురుని పాత్రలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ కనిపించనున్నారు. అదేవిధంగా దశరథుడి పాత్రలో కృష్ణంరాజు నటిస్తున్నట్లు సమాచారం.ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సీత పాత్రలో నటించడానికి ఎంతోమంది హీరోయిన్ పేర్లు వినిపించాయి. ముందుగా కీర్తి సురేష్ పేరు వినిపించింది. తరువాత కియారా అద్వానీ, అనుష్క శర్మ, కృతిసనన్ పేర్లు వినిపించాయి. ఈ అందరి హీరోయిన్స్ తో టెస్ట్ లుక్ చేయటంతో కీర్తి సురేష్ సీత పాత్రకు సరిగ్గా సరిపోతుందని, ఫైనల్ గా సీత పాత్రలో నటించడానికి కీర్తి సురేష్ దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కీర్తి సురేష్ మహేష్ బాబు సరసన “సర్కారీ వారి పాట”చిత్రంలో నటిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాను టీ సిరీస్ పతాకంపై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ నిర్మిస్తున్నారు