Bheemla nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘భీమ్లానాయక్’. ఈ సినిమా తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఫిబ్రవరి 25వ తేదీన భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టబోతున్నారు. పలు వాయిదాలు పడి ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా మీద ఇప్పటి వరకు వచ్చిన పవన్ కళ్యాణ్, రానాల టీజర్స్తో పాటు పాటలు..పోస్టర్స్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ప్రమోషన్స్ మొదలు పెట్టి ఆ అంచనాలను మరో స్థాయిలో పెంచబోతోంది చిత్రబృందం. ఈ క్రమంలో భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించబోతున్నారు.
ఈ గ్రాండ్ ఈవెంట్కు హైదరాబాద్ పోలీస్ గ్రౌండ్స్ వేదిక కానుంది. అంతేకాదు ఎవరూ ఊహించని విధంగా తెలంగాణ ఐటి మినిస్టర్ కల్వకుంట్ల తారకరామారావు (కె.టి.ఆర్) ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. కొద్ది సేపటి క్రితం ఈ విషయాన్ని సితార ఎంటర్మైంట్స్ వారు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా భీమ్లానాయక్ పోస్టర్ మీద కె.టి.ఆర్ ఫొటోతో అప్డేట్ ఇచ్చారు. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఈనె ఫిబ్రవరి 21వ తేది సోమవారం నిర్వహించబోతున్నారు. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి, నిత్యా మీనన్, సంయుక్త మీనన్లతో పాటు ఇతర తారాగణం చిత్రబృందం మొత్తం ఈ ఈవెంట్లో సందడి చేయనున్నారు.
Bheemla nayak: మహేశ్ బాబు, ఎస్ ఎస్ రాజమౌళి కూడా..?
అయితే..విశ్వనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం మేరకు ఛీఫ్ గెస్ట్గా కె.టి.ఆర్ అలాగే సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కూడా రాబోతున్నట్టు తెలుస్తోంది. మరి ఈ గ్రాండ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ స్పీచ్ ఎలా ఉంటుందో అని అందరూ ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. ఇక ఈ ఈవెంట్లో సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ లైవ్ మ్యూజికల్ ఈవెంట్ కూడా అదనపు ఆకర్షణగా ఉండబోతుందట. కాగా, ఈ సినిమాను మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుం కోషియం సినిమాకు అధికారికంగా తెలుగులో రీమేక్ చేశారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందివ్వగా, అప్పట్లో ఒకడుండేవాడు ఫేమ్ సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించారు.