Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలె `పుష్ప` వంటి పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. ఫస్ట్ పార్ట్ `పుష్ప ది రైజ్` గత ఏడాది విడుదలై మంచి విజయం సాధించింది. ఇప్పుడు బన్నీ పుష్ప 2పైన ఫోకస్ పెట్టాడు.
అయితే పుష్ప పూర్తైన తర్వాత బన్నీ దర్శకధీరుడు రాజమౌళితో ఓ పాన్ ఇండియా సినిమా చేయబోతున్నాడని గత కొద్ది రోజుల నుంచీ జోరుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలు విని బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. ప్రస్తుతం `ఆర్ఆర్ఆర్` తో బిజీగా గడుపుతున్న రాజమౌళి.. ఆ తర్వాత మహేష్ బాబుతో ఈ సినిమాను పట్టాలెక్కించనున్నాడు.
ఇది కంప్లీట్ అయిన అనంతరం రాజమౌళి, బన్నీల ప్రాజెక్ట్ ఉంటుందని..ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ అల్లు అర్జున్ కోసం ఇప్పటి నుంచే ఓ కథను కూడా సిద్ధం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో ఇది నిజమే అని చాలా మంది నమ్ముతున్నారు.
అయితే ఇలాంటి తరుణంలో ఓ బ్యాడ్ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే.. బన్నీ, రాజమౌళి కాంబో ప్రాజెక్ట్ సెట్ అవ్వడం నిజం కాదట. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజమౌళిని ఈ విషయంపైనే ప్రశ్నించగా.. తానేమి బన్ని తో సినిమా అనుకోలేదని, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కేవలం పుకారే అని చెప్పినట్లు తెలుస్తోంది.