Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబుకి గత ఏడాది అసలు కలిసి రాలేదు. జనవరి నెలలో అన్నయ్య రమేష్ బాబు సెప్టెంబర్ నెలలో తల్లి ఇందిరాదేవి నవంబర్ నెలలో తండ్రి సూపర్ స్టార్ కృష్ణ ముగ్గురు మరణాలతో మహేష్ తల్లడిల్లిపోయాడు. ఒకే సంవత్సరంలో కుటుంబంలో ముగ్గురు మరణించడంతో ఘట్టమనేని ఫ్యామిలీ కన్నీరు మున్నీరయింది. “సర్కారు వారి పాట” సినిమా రిలీజ్ అయ్యాక మే నెలలో త్రివిక్రమ్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేయటం జరిగింది. కానీ అనుకోని కారణాలవల్ల సినిమా షూటింగ్ వాయిదా పడుతూ ఎట్టకేలకు అక్టోబర్ నెలలో మొదలయ్యింది. మొదటి షెడ్యూల్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇక రెండవ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది అనుకున్న సమయంలో సూపర్ స్టార్ కృష్ణ మరణించడంతో క్యాన్సిల్ అయింది.
అయితే ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 28వ తారీకు రిలీజ్ అవుతున్నట్లు ముందుగానే అధికారిక ప్రకటన చేశారు. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో ఇప్పుడు ఈ సినిమా ఆగస్టు నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు అని అంటున్నారు. “SSMB 28” వర్కింగ్ టైటిల్ తో తెరకేకుతున్న ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో గతంలో మహేష్ “అతడు” మరియు “ఖలేజా” సినిమాలు చేశాడు. నటనపరంగా రెండు కూడా మహేష్ లో కొత్తదనాన్ని చూపించడం జరిగింది. దీంతో వస్తున్న ఈ మూడో సినిమాపై ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్.. సంక్రాంతి తర్వాత మొదలుకానున్నట్లు సమాచారం.
సెకండ్ షెడ్యూల్ ఏకంగా 60 రోజులపాటు జరుపుకోనున్నట్లు.. ప్రధాన సన్నివేశాలు చాలా వరకు ఈ షెడ్యూల్లో కవర్ అయ్యేలా త్రివిక్రమ్ ప్లాన్ చేసినట్లు సమాచారం. దీంతో న్యూ ఇయర్ వేడుకలు ఫారెన్ లో జరుపుకున్న మహేష్ ఫ్యామిలీ తాజాగా ఈరోజు విదేశాల నుండి తిరిగి రావటం జరిగింది. దీనికి సంబంధించిన ఎయిర్ పోర్ట్ వీడియో వైరల్ అవుతుంది. త్రివిక్రమ్ సినిమా కంప్లీట్ అయిన వెంటనే రాజమౌళి సినిమా షూటింగ్ మహేష్ జాయిన్ కానున్నారు. రాజమౌళి సినిమా ప్రకటన కృష్ణ బర్త్ డే నాడు మే 31 వ తారీకు.. ప్రకటించనున్నట్లు సమాచారం.
SuperStar @urstrulyMahesh is back in Hyderabad 🛬✨ #MaheshBabu along with his family papped 📸 at the airport as they are back from a much needed vacay!! ❤️#NamrataShirodkar #GautamGhattamaneni #SitaraGhattamaneni #SSMB pic.twitter.com/ULnEbLEJVX
— BA Raju's Team (@baraju_SuperHit) January 7, 2023