ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ సైరా నరసింహా రెడ్డి. చాలా ప్రేస్టిజీయస్గా తీసుకోని కొనిదెల ప్రొడక్షన్ లో భారీ బడ్జెట్తో ఈ సినిమాని నిర్మిస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా కంప్లీట్ అయింది. అయితే సైరా సెట్స్ పైన ఉండగానే మరో సినిమాని లైన్లో పెట్టాడు చిరు. ఇటీవలే జరిగిన వినయ విధేయ రామ సినిమా ఆడియో పంక్షన్లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్తో తన నెక్ట్స్ సినిమా ఉంటుందని చెప్పాడు మెగాస్టార్. అయితే త్రివిక్రమ్, బన్నితో సినిమా చేయబోతున్నాడు. కాబట్టి ఈ గ్యాప్లో ముందు అనుకున్నట్టు హ్యాట్రిక్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్లో సినిమా చేయబోతున్నాడట. ఓ సోషల్ మేసేజ్ కథకు కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తూ మంచి స్టోరీని రెడీ చేసిన కొరటాల, ఈ ప్రాజెక్ట్ కోసం అవసరమైన ప్రీ-ప్రొడక్షన్ వర్క్ ని జరుపుతున్నాడు.
నిజానికి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని జనవరి నెలలోనే మొదలు పెట్టాలకున్నారు కానీ సైరా పనులు పూర్తికాకపోవడంతో, చిరు-కొరటాల ప్రాజెక్ట్ కొంచెం లేట్ గా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. నిజానికి చిరు, త్రివిక్రమ్ మూవీ అనౌన్స్ చేయడంతో… కొరటాల ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందని, చిరూకి కథ నచ్చలేదని ఇండస్ట్రీలో ఏవేవో రూమర్స్ వినిపించాయి. ఇవి కాస్త శృతిమించుతుండడంతో, ఈ సినిమాని నిర్మించనున్న కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వాళ్లు స్పందించారు. చిరు-కొరటాల సినిమా ఆగిపోలేదని, సైరా అయిపోయిన తర్వాత సెట్స్ పైకి వెళ్తుందని, ఈ విషయంలో బయట వినిపిస్తున్న ఎలాంటి రూమర్స్ ని నమ్మకండని క్లారిఫికేషన్ ఇచ్చేశారు.